కాళహస్తిలో లోక్సభ స్పీకర్ రాహుకేతు పూజలు | Sakshi
Sakshi News home page

కాళహస్తిలో లోక్సభ స్పీకర్ రాహుకేతు పూజలు

Published Fri, Apr 10 2015 1:47 PM

Sumitra Mahajan offers prayers at Tirupati, kalahasti shrine

తిరుపతి : లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం శ్రీకాళహస్తి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుకేతు పూజలు నిర్వహించారు.  అంతకు ముందు సుమిత్రా మహాజన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గత రాత్రే ఆమె తన కుటుంబంతో కలిసి తిరుమల విచ్చేశారు. ఈ రోజు తెల్లవారుజామున సుమిత్రా మహాజన్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆమె ఆలయ సమీపంలోని అఖిలాండం వద్ద  దీపాలు వెలిగించారు. ఆలయ అధికారులు ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్కు స్వామివారి శేషవస్త్రంతో పాటు లడ్డూ ప్రసాదం అందచేశారు.

 

Advertisement
Advertisement