నల్లగొండ, న్యూస్లైన్ :సీమాంధ్రులకు బుద్ధి చెప్పేందుకు ఈనెల 29వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న సకల జనభేరికి విద్యుత్ ఉద్యోగులు భారీగా తరలిరావాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ కేంద్ర సంఘం నాయకులు ముత్యం వెంకన్నగౌడ్, స్వామిరెడ్డి, గోపాల్రావు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయం ఆవరణలో జరిగిన జనభేరి సన్నాహక సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. సీ మాంధ్ర పాలకులు విద్యుత్ సంస్థను విచ్ఛిన్నం చేసి ప్రాజెక్టులను తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ సాధించుకోవడం ఎంత ముఖ్యమో సంస్థను కాపాడుకోవడం కూడా అంతే ప్రధానమన్నారు.
పార్లమెం టులో బిల్లు ఆమోదింపజేసుకునే వరకు రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జనభేరి సభ తర్వాత అక్టోబర్ 5వ తేదీన తలపెట్టిన విద్యుత్ఉద్యోగులు సమరభేరికి కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ సభలో విద్యుత్ టీజాక్ కేంద్ర సంఘం నాయకులు యాదగిరి, సత్యనారాయణ, రవీందర్, టీజాక్ జిల్లా చైర్మన్ కృష్ణ య్య, కేవీఎన్రెడ్డి, కోకన్వీనర్లు మహ్మద్సలీం, వెంకటయ్య, సీహెచ్ శ్రీనివాస్, రాధాకృష్ణ, కరెంట్రావు, శ్రీని వాస్, నరేష్కుమార్రెడ్డి, ప్రవీణ్కుమార్, ముత్తయ్య, సురేష్కుమార్, తిరుపతయ్య, రవీందర్రెడ్డి, వెంకటేశ్వర్లు, బాలూనాయక్, టి. యాదయ్య, జైపాల్, నాగేంద్రప్రసాద్, గురువయ్య, విష్ణువర్దన్రెడ్డి, కిషన్ప్రసాద్, పద్మ, హేమలత, సుగుణ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.