ఇసుక వాహనాలకు కనిపించని ‘జీపీఎస్’
సీసీ కెమెరాల నిఘా కరువు
అడ్డూఅదుపు లేని అక్రమరవాణా
పట్టించుకోని అధికారులు
శ్రీకాకుళం : జిల్లాలోని రీచ్లనుంచి ఇసుక ఎక్కడకెక్కడకు వెళుతోందీ. ఏ వాహనం ఎలా తీరుగుతోందీ తెలుసుకునేందుకు రూపొం దించిన జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ఎక్కడా అమలు కావడంలేదు. అక్రమ రవాణా అరికట్టేందుకు రీచ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు కాలేదు. నిర్వాహకుల అలక్ష్యానికి అధికారుల పర్యవేక్షణ లోపం తోడవడంతో అక్రమ వ్యాపారం మూడులారీలు.. ఆరు ట్రాక్టర్లుగా సాగిపోతోంది.
అమలు కాని ఆదేశాలు
జిల్లాలో 33చోట్ల ఇసుక రీచ్లకు జిల్లా యంత్రాంగం అనుమతిచ్చింది. ప్రస్తుతం 9చోట్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయించినా, కోట్లాదిరూపాయలు ప్రభుత్వానికి జమ చేసినా ఆయా వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ లేకుండానే ఇసుక తరలిపోయింది. అధికారులు ఇటీవల మూడు రోజుల పాటు రీచ్ల్లో తవ్వకాలను నిలిపివేశారు. లారీలు, ట్రాక్టర్లకు జీపీఎస్ అమర్చాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసినా అమలు కాలేదు. పొరుగున ఉన్న విజయనగరం జిల్లాలో జీపీఎస్ వ్యవస్థ శతశాతం అమలైనట్టు అక్కడి అధికారులు చెబుతున్నా, ఈ జిల్లాలో ఆ చర్యలు కానరావడంలేదు. డీఆర్డీఏ, మెప్మా విభాగాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఇసుక ర్యాంప్ల్లో మహిళా సంఘాల మాటున టీడీపీ కార్యకర్తలే బినామీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం ఇటీవల శ్రీకాకుళం పట్టణ నడిబొడ్డన ఏర్పాటైన హయాతినగరం ఇసుక రీచ్లో బయటపడింది. వైఎస్సార్సీపీ నేతలు పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించి ర్యాంప్ వద్ద ఆందోళన నిర్వహించడంతో బెంబేలెత్తిపోయిన అధికారులు ప్రస్తుతం ర్యాంప్ లావాదేవీలు నిలిపివేశారు.
అక్రమ వ్యాపారానికి అండ
జిల్లాలో జీపీఎస్ వ్యవస్థ అన్ని వాహనాలకూ గత జూన్ 17లోగా అమర్చాలని అధికారులు నిర్ణయించారు. రెండు నెలలవుతున్నా దానినెవరూ పట్టించుకోలేదు. రాత్రి పూట జరిగే అక్రమ లావేదేవీలకు, రీచ్పాయింట్ నుంచి ఏ వాహనం ఎక్కడకు చేరుతుందో తెలుసుకునేందుకు ఈ వ్యవస్థ అనివార్యం. కానీ అక్రమవ్యాపారులకు ఇబ్బంది కలగకూడదనే దీనిపై నిఘా పెట్టడానికి అధికారులు సాహసించడంలేదు. సీసీ కెమెరాలు కూడా మూడంటే మూడే రీచ్ల్లో ఏర్పాటు చేశారు. వాటి పనితీరు పసిగట్టేందుకు అధికారులకు సమయం లేదు. ఒక్కో వాహనానికి రూ.4600చెల్లిస్తే(సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రైవేట్ సంస్థలకు) ప్రత్యేక సిమ్కార్డు యాక్టివేషన్ ద్వారా, వాహనానికి స్టిక్కర్ అంటించడం ద్వారా జీపీఎస్ వ్యవస్థ అమల్లోకి తేవచ్చు. కానీ టీడీపీ బినామీలే నడిపిస్తున్న రీచ్ల్లో ఇంత సొమ్ము పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టిసారించాల్సి ఉంది.
ఎక్కడికి తరలిపోతోందో?
Published Wed, Aug 12 2015 3:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement