కర్నూలు(విద్య), న్యూస్లైన్ : పదో తరగతి విద్యావిధానాన్ని ఈ ఏడాది విద్యాశాఖ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తోంది. అందులో భాగంగా పాఠ్యాంశాల మార్పుతోపాటు విద్యాబోధన, పరీక్ష విధానంలోనూ మార్పులు తెస్తోంది. జాతీయ పాఠ్యప్రణాళిక ప్రకారం రాష్ట్ర విద్య పరిశోధన మండలి 2012-13 విద్యాసంవత్సరంలో 1, 2, 3, 6, 7 తరగతుల పాఠ్యపుస్తకాలను మార్చింది. 2013-14లో 4, 5, 8, 9 తరగతులకు, ఈ విద్యాసంవత్సరం నుంచి 10వ తరగతికి సిలబస్ను మార్పు చేసింది. మారిన సిలబస్లో కృత్యాధార బోధనకు ప్రాధాన్యం లభిచింది.
పాఠ్యపుస్తకాలు బట్టీకొట్టేవిగా కాకుండా విషయ అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. పాఠ్యాంశాలను విద్యార్థులు చదవడంతో పాటు ఆలోచించడం, నేర్చుకున్న విషయాన్ని వ్యక్తీకరించడం, విశ్లేషణ చేసే విధంగా, వ్యక్తిత్వాన్ని పెంచే విధంగా ఈ పుస్తకాలను రూపొందించారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచడం, మహిళలను గౌరవించడం, స్త్రీ సాధికారికత తదితర విషయాలకు ప్రాధాన్యనిచ్చారు.
పరీక్ష విధానంలో సంస్కరణలు
పాఠశాల విద్యాశాఖ దాదాపు 15 ఏళ్ల తర్వాత పదో తరగతి పరీక్షా విధానంలో మార్పు చేసింది. ఇప్పటి వరకు హిందీ పరీక్షకు మాత్రమే ఒక్క పేపర్ ఉండేది. మిగిలిన ఐదు పరీక్షలకు రెండేసి పరీక్షలు రాయాల్సి వచ్చేది. అయితే ఈ ఏడాది నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులకు కూడా ఒక్క పేపర్ మాత్రమే ఉంటుంది. మిగిలిన సైన్స్, సోషియల్, లెక్కలు సబ్జెక్టులకు రెండు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు 80 మార్కుల రాత పరీక్ష ఉంటుంది. 20 మార్కులకు ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. రాత పరీక్ష, ఇంటర్నల్ మార్కులు కలిపి 35 మార్కులు తెచ్చుకుంటేనే ఆ విద్యార్థి ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణుడైనట్లు పరిగణలోకి తీసుకుంటారు. గతంలో హిందీ సబ్జెక్టులో 20 మార్కులు తెచ్చుకుంటే చాలు పాస్ చేసేవారు. ప్రస్తుత విధానంలో ఈ సబ్జెక్టులోనూ 35 మార్కులు తెచ్చుకోవాల్సిందే.
‘పది’లో ప్రక్షాళన
Published Tue, May 27 2014 12:42 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
Advertisement