కాంగ్రెస్‌కు తైనాల గుడ్‌బై | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు తైనాల గుడ్‌బై

Published Sun, Feb 9 2014 2:48 PM

కాంగ్రెస్‌కు తైనాల గుడ్‌బై - Sakshi

విశాఖపట్నం: విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ కాంగ్రెస్‌పార్టీకి గుడ్‌బై చెప్పారు. శ్రీకాకుళంలో ఈనెల 9న వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు ఆయన ప్రకటించారు. శనివారం తైనాల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ప్రజలకు తీరని ద్రోహం చేస్తోందని అందుకు నిరసనగానే పార్టీని వీడుతున్నానని స్పష్టం చేశారు.

ఈ మేరకు గాంధీభవన్‌కు ఫ్యాక్స్ పంపించనున్నట్టు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జగన్‌మోహన్‌రెడ్డి శాయశక్తులా కృషి చేస్తున్నారని తైనాల తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల్ని పూర్తిచేసేందుకు వైఎస్సార్‌సీపీలోకి వెళ్తున్నట్టు తెలిపారు.

Advertisement
Advertisement