- తమిళ స్మగ్లర్ల విచారణతో పలు ఆసక్తికర అంశాలు
- అధికారులకు మంత్రి స్థాయిలో ఒత్తిళ్లు
- భారీగా దొరుకుతున్న ఎర్ర డంప్లు
- తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తమిళ స్మగ్లర్ల విచారణతో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. ముఖ్యం గా చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లోని పలువురు ‘పచ్చ’నేతలకు ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ‘దేశం’ తమ్ముళ్లకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నా యి. ఇప్పటికే పలువురు తెలుగు తమ్ముళ్లకు స్మగ్లింగ్తో సం బంధం ఉందని, ఇందుకు అవసరమైన ఆధారాలు సైతం అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ టీడీపీ నేతల ప్రమేయానికి సంబంధించిన నివేదికను బయట పెట్టకుండా అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
దీంతో టాస్క్ఫోర్సు, పోలీస్, అటవీ శాఖ ఉన్నతాధికారులు స్మగ్లర్ల జాబితాను గోప్యంగా ఉంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. విషయాన్ని బయటపెడితే ఎక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని అధికారులు సైతం ఆందోళన చెందుతున్నట్ల్లు చర్చ సాగుతోంది. ఇప్పటికే చిత్తూరు జిలాల్లో ఎస్పీ 12 మందిపై పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్కు పంపారు. వారం రోజులు అయినా దీనిపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ఈ జాప్యం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
తమిళనాడులో ప్రకంపనలు...
తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు వరసగా పట్టుబడుతున్నారు. గత నెల 19న పశ్చిమ బెంగాల్ - చెన్నై ఆపరేషన్లో జిల్లా పోలీసులు షణ్ముగం, సౌందర్రాజన్ ముఠా నుంచి దాదాపు రూ.23 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా చెన్నై నగరంలోని తూత్తుకుడిలో రూ.8 కోట్లు విలువ చేసే ఎర్రచందనం డంప్ను పోలీసులు గుర్తించారు. జిల్లాలోని శేషాచలం అడవుల నుంచి ఎర్ర సంపద అక్రమంగా రాష్ట్ర సరిహద్దులు దాటి విదేశాలకు వెళ్లడంపై జిల్లా పోలీసు యంత్రాంగం చాలా సీరియస్గా ఉంది. దీనికి తోడు శేషాచలంలో జరిగిన ఎన్కౌంటర్ జిల్లా పోలీసులపై మరింత ఒత్తిడిని పెంచింది.
ఈ క్రమంలో ఆపరేషన్ రెడ్, టాస్క్ఫోర్సు పోలీసులు చేస్తున్న దాడులు కలిసి వస్తున్నాయి. ప్రధానంగా తమిళనాడులోని పలువురు స్మగ్లర్లు, అన్నా డీఎంకే పార్టీకి చెందిన నాయకులకు ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే చెన్నైకు చెందిన షణ్ముగం ముఠా, వేలూరుకు చెందిన మోహనాంబాల్ను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారం మేరకు పలు ప్రాంతాల్లో దాడులు చేసి, ఎర్రచందనం నిల్వలను గుర్తిస్తున్నారు.ఎర్ర స్మగ్లింగ్ వ్యవహారం తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే, నేతలతో పాటు సినిమా పరిశ్రమలోని పలువురికి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు వెల్లడికావడంతో ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.తూత్తుకుడి, తిరువళ్లూరు, చెన్నై. సేలం. వేలూరు జిల్లాలోని కూలీలకు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ జిల్లాలో సైతం ఇది హాట్ టాపిక్గా మారింది.
‘దేశం’ నేతల్లో వణుకు
Published Mon, May 4 2015 3:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యదు! గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement