టెక్కలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మానసిక స్థితి సక్రమంగా లేదని అందుకే ప్రతిపక్ష పార్టీ ధాటికి తట్టుకోలేక దుష్ర్పచారాలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ నివాసంలో తమ్మినేని మాట్లాడుతూ పాలనలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిన చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకు చెందిన నాయకులే ప్రజల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని ఆయన చెప్పారు.
దీంతో పార్టీలో ఉండాలా వద్దా అనే సందిగ్ధంలో పడిన అధికార పార్టీ నాయకులు వలస ప్రవాహానికి సిద్ధంగా ఉన్నారని తమ్మినేని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ లో టీడీపీ టెంట్ ఖాళీ అయ్యిందని, కేవలం అవినీతి కథల సూత్రదారి రేవంత్ రెడ్డి మాత్రమే తెలంగాణ కు దిక్కుగా చంద్రబాబు అవినీతికి అండగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నీతి, నిజాయితీలు లేని ముఖ్యమంత్రిగాబాబుకు పట్టం కట్టవచ్చని విమర్శిం చారు. నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి దువ్వాడ వాణి, పార్టీ నాయకులు సంపతిరావు రాఘవరావు, బెండి గౌరీపతి, బి.కర్మవీరుడు, జి.మోహన్రెడ్డి, ఎస్.మోహన్, బి.చంద్రరావు, ఎ.తాతారావు, యు.విశ్వనాథం, చందు, ఉదయ్ పాల్గొన్నారు.
‘దళితులపై చిన్నచూపు తగదు’
ఆమదాలవలస: దళితులపై చిన్నచూపు చూస్తూ కులవివక్ష చేసి మాట్లాడడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన గృహంలో విలేకరులతో మాట్లాడుతూ దళితులను అపహాస్యం చేస్తూ బహిరంగంగా మాట్లాడడం సబబుకాదన్నారు.
ఇందుకు నిరసనగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శనివారం అన్ని పట్టణాల్లోనూ, పల్లెల్లోనూ ఉన్న అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి నిరసనలు తెలుపుతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆమదాలవలస పాతబస్టాండ్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి శనివారం ఉదయం 10 గంటలకు పాలాభిషేకం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మండలం, మున్సిపాలిటీల్లోని దళితులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
బాబుకు మానసిక స్థితి సరిగా లేదు
Published Sat, Feb 20 2016 12:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement