సరుబుజ్జిలి: కుటుంబ సభ్యులతో గడపడానికి ఐదు రోజుల సెలవుపై గత నెల స్వగ్రామానికి వచ్చాడు. పెళ్లి చేసుకోరా నాయనా అంటే అప్పుడే తొందరేమొచ్చింది. వచ్చే ఏడాది చూద్దాంలే అన్నాడు. త్వరలోనే సెలవుపై మళ్లీ వస్తానని గత నెల 26వ తేదీన విధి నిర్వహణకు వెళ్లాడు. కానీ అదే ఆఖరి చూపవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. స్వశక్తితో పైకి వచ్చిన పెద్దకుమారుడు తమను ఆదుకుంటాడని భావిస్తే విధి నిర్వహణలో దుండగుల చేతిలో హతమారాడని తెలిసి వారు గుండలవిసేలా విలపిస్తున్నారు. ఇదీ రంగారెడ్డి జిల్లా షామీర్పేట సమీపంలోని శుక్రవారం అర్ధరాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులకు దొంగనోట్ల ముఠాకు మధ్య జరిగిన కాల్పులు, కత్తిపోట్ల సంఘటనలో మృత్యువాతపడిన ఏఆర్ కానిస్టేబుల్ తాడేలు ఈశ్వరరావు(29) కుటుంబం పరిస్థితి. వివరాల్లోకి వెళితే...
సరుబుజ్జిలి మండలం షలంత్రికి చెందిన ఈశ్వరరావు కుటుంబం కాయకష్టం మీదే ఆధారపడింది. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. స్వశక్తితో ఎదిగిన ఆయన 2011లో ఏఆర్ కానిస్టేబుల్గా విధుల్లో చేరగా టాస్క్ఫోర్స్ దళానికి కేటాయించారు. ఈశ్వరరావుకు తల్లిదండ్రులు మల్లేశ్వరరావు, తవిటమ్మ, సోదరుడు రమణ, సోదరి ఉన్నారు. గ్రామీణ నేపథ్యమైనప్పటికీ రక్షణ దళంలో చేరాలన్న పట్టుదలతో కానిస్టేబుల్గా ఎన్నికయ్యాడు. అందరితో సరదగా ఉండే ఈశ్వరరావు గత నెల సెలవులో వచ్చి 26న డ్యూటీకి వెళ్లాడు. అదే ఆఖరి చూపవుతుందని ఊహించలేదని తండ్రి మల్లేశ్వరరావు రోదిస్తూ చెప్పారు. ఈశ్వరరావు మృతి చెందిన సమాచారం తెలిసి షలంత్రి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
ఈశ్వర్ మృతిపట్ల చంద్రబాబు విచారం
దొంగనోట్ల ముఠా జరిపిన దాడిలో కానిస్టేబుల్ ఈశ్వర్ మృతి చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈశ్వర్ కుటుంబానికి సంతాపం ప్రకటించారు. కాగా, ఈశ్వరరావు మృత దేహాన్ని ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక హెలికాప్టర్లో శనివారం రాత్రి తీసుకువచ్చారు.
పెళ్లికి తొందరేంటన్నాడు... తొందరగా వెళ్లిపోయాడు
Published Sun, Aug 3 2014 10:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement