అనంతపురంలో ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

అనంతపురంలో ఉద్రిక్తత

Published Sat, Apr 2 2016 12:33 PM

tax allegations in anantapur distirict

అనంతపురం: అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  నగరపాలక సంస్థ అధికారులు పన్నులు చెల్లించని పలు దుకాణాలను సీజ్ చేసేందుకు శనివారం యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పన్ను చెల్లించలేదని స్థానికంగా ఉండే వాసవీ కల్యాణ మండపాన్ని మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. అందుకు నిరసగా మున్సిపల్ కార్యాలయాన్ని ఆర్యవైశ్యులు ముట్టడించారు.

ఈ ముట్టడి కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ కొవటం విజయభాస్కర్ రెడ్డి మద్దతు తెలిపారు. ఆందోళన చేస్తున్న ఆర్యవైశ్యులను, విజయభాస్కర్ రెడ్డి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఆర్యవైశ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఈ తోపులాటలో తప్పించుకునే ప్రయత్నంలో విజయభాస్కర్ రెడ్డి కిందపడిపోవడంతో గాయాలయ్యాయి.
 

Advertisement
Advertisement