కిషన్‌రెడ్డికి విమర్శించే హక్కులేదు : టీడీపీ | Sakshi
Sakshi News home page

కిషన్‌రెడ్డికి విమర్శించే హక్కులేదు : టీడీపీ

Published Sun, Sep 8 2013 9:31 PM

TDP Criticises Kishan Reddy

తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న సమయంలో కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా తప్పించుకు తిరిగిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కి షన్‌రెడ్డికి టీడీపీని విమర్శించే హక్కులేదని ఆ పార్టీ రాష్ట్ర నేతలు బి.శోభారాణి, నన్నూరి నర్సిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజనపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూనే ఉందన్నారు.

ఇరు ప్రాంతాలకూ న్యాయం జరగాలనే ధ్యేయంతో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు విధానాన్ని బీజేపీ దుయ్యబట్టడం సరికాదని హితవు పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోరిక మేరకు రాష్ట్ర విభజనపై తమ పార్టీ ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఈ మేరకు వారు ఆదివారం విలేకరులతో మాట్లాడారు.
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement