కదిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం | Sakshi
Sakshi News home page

కదిరిలో టీడీపీ నేతల దౌర్జన్యం

Published Sat, Sep 9 2017 6:44 PM

TDP ex mla prasad supporters attacks ysrcp leader siddareddy driver

అనంతపురం : అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వైఎస్‌ఆర్‌ సీపీ నమన్వయకర్త డాక్టర్‌ సిద్ధారెడ్డి ఏర్పాటు చేసిన వాటర్‌ ట్యాంకర్లను మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌ వర్గీయులు అడ్డుకున్నారు. డ్రైవర్‌పై కందికుంట వర్గీయులు దాడి చేసి, ఫ్లెక్సీలు చించివేశారు. ఈ ఘటనపై సిద్ధారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు అరాచకంగా వ్యవహరిస్తున్నారని, తాగునీటి సమస్య తీరుస్తుంటే ఆటంకాలు సృష్టించడం దుర్మార్గమన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement