మునిపల్లి, న్యూస్లైన్: మండలకేంద్రమైన మునిపల్లిలో మంగళవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రసాభాసగా మారింది.రచ్చబండ కార్యక్రమంలో సర్పంచ్లకు కుర్చీలు వేయకపోవడంపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహల మంజూరీ పత్రాలను సర్పంచ్ల చేత లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. మునిపల్లి గ్రామ సర్పంచ్ఒక్కరితోనే గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహ మంజూరు పత్రాలు పంపిణీ చేయడం ఎంత వరకు సమంజసమని టీడీపీ నాయకులు వీరన్న, వెంకట్రాములు ఇన్చార్జి ఎంపీడీఓ వామన్రావును నిలదీశారు.
మునిపల్లి ఒక్క గ్రామానికే మంజూరు పత్రాలు పంపిణీ చేయిస్తే మండలంలోని 24 గ్రామ పంచాయతీల నుంచి లబ్ధిదారులను ఎందుకు పిలిపించారని ఎంపీడీఓపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ను అధికారులు పాటించకపోవడంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. రాయికోడ్, మునిపల్లి మండలాల మార్కెట్ కమిటీ చెర్మైన్ తాటిపల్లి రాంరెడ్డి జోక్యం చేసుకొని లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచ్లతో పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ మంజూరు పత్రాలను పంపిణీ చేయించారు. లబ్ధిదారులకు భోజన వసతి కల్పించినా కొందరికే సరిపోవడంతో మిగిలిన వారు నిలదీశారు. సీఎం ఫొటోతో ఉన్న బ్యానర్ను కొందరు తొలగించడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు డిప్యూటీ సీఎం ఫొటోతో ఉన్న బ్యానర్ను ఏర్పాటు చేశారు.
రచ్చబండలో రచ్చ..రచ్చ..
Published Tue, Nov 26 2013 11:29 PM
Advertisement
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- అరాచకాల అసత్యమూర్తి
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- Kishori Lal Sharma: నేను గెలిస్తే గాంధీలు గెలిచినట్లే
Advertisement