యల్లమంద (నరసరావుపేట రూరల్) : అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలకు అంతేలేకుండాపోతోంది. అదను దొరికితే వైఎస్సార్ సీపీ నాయకులపై అకారణంగా దాడులకు దిగుతూ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్నికలు ముగిసి మూడు నెలలవుతున్నా టీడీపీ వర్గీయులు అకారణంగా వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. తాజాగా అధికార టీడీపీ నాయకులు మారణాయుధాలు, గొడ్డళ్లతో వైఎస్సార్ సీపీ నాయకులపై దాడికి పాల్పడిన ఘటన యల్లమంద గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు వైఎస్సార్ సీపీ నాయకులు గాయపడ్డారు.
సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు ముప్పాళ్ళ కృష్ణారావు, ముప్పాళ్ళ లక్ష్మయ్య, చల్లా వెంకటేశ్వర్లు తమ బంధువు ములసా వెంకటేశ్వర్లు ఇంట్లో జరిగే శుభకార్యానికి ద్విచక్ర వాహనంపై గ్రామంలోని తూర్పుబజారుకు బయలుదేరారు. మార్గంమధ్యలో టీడీపీ నాయకుడు ఉప్పుటూరి శంకరయ్య ఇంటి వద్దకు వెళ్లేసరికి శంకరయ్యతోపాటు ఆ పార్టీ నాయకులు పాములపాటి వాసు, కడియాల శ్రీను, మానుకొండ నిరంజన్, మానుకొండ రామకృష్ణ, చుండూరి రాజు, మానుకొండ కోటయ్య, కొల్లా కిషోర్లు మూకుమ్మడిగా పరుష పదజాలంతో వారిని దూషించారు.
‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మీరు నాయకులా.. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు రిగ్గింగ్ చేయకుండా అడ్డుకుంటారా.. మీ అంతు చూస్తామంటూ మారణాయుధాలతో దౌర్జన్యానికి దిగారు. వారిలో ఒకరు గడ్డపలుగు తీసుకుని కృష్ణారావు మీదకు వెళ్లగా ఆయన ప్రాణభయంతో పరుగుపెట్టాడు. టీడీపీ నాయకులు వెంటపడి గొడ్డలితో కృష్ణారావు ఎడమకాలుపై నరికారు. ఇనుపరాడ్లతో ఇష్టారాజ్యంగా కొట్టారు. అడ్డుకోబోయిన లక్ష్మయ్య, వెంకటేశ్వర్లుపైనా దాడికి దిగారు. కృష్ణారావు తీవ్రంగా, మిగిలిన ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ రమేష్ సిబ్బందితో యల్లమంద గ్రామానికి వెళ్లి బందోబస్తు నిర్వహించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులకు వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ
యల్లమంద గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ వర్గీయులపై దాడి జరిగిందన్న సమాచారం మేరకు ఎంపీపీ కొమ్మాలపాటి ప్రభాకరరావు, ఇక్కుర్రు గ్రామ సర్పంచ్ పదముత్తం చిట్టిబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు మూరె రవీంద్రారెడ్డి, షేక్ పొదిలిఖాజా, జగన్మోహన్రెడ్డి, ముప్పాళ్ళ నాగేశ్వరరావు తదితరులు ఏరియా వైద్యశాలకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఎంపీపీ ప్రభాకరరావు మాట్లాడుతూ టీడీపీ వర్గీయుల దౌర్జన్యానికి ఇలాంటి సంఘటనలు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయన్నారు. అధికారం ఉందన్న అహంకారంతో వైఎస్సార్ సీపీ శ్రేణులపై దాడులు చేయడం దారుణమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
యల్లమందలో టీడీపీ దాష్టీకం
Published Tue, Aug 19 2014 12:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement