'తాడిపత్రి వదిలివెళ్లండి.. లేకుంటే చంపేస్తాం' | Sakshi
Sakshi News home page

'తాడిపత్రి వదిలివెళ్లండి.. లేకుంటే చంపేస్తాం'

Published Wed, Oct 22 2014 10:26 PM

TDP Leaders Attacking On Ysrcp worker Kishore at Tadipatri

అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో టీడీపీ నేతలు బుధవారం దౌర్జన్యయానికి దిగారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త కిషోర్పై టీడీపీ నేతలు దాడి చేశారు. అంతేకాకుండా అతని కుటుంబంపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలయినట్టు తెలుస్తోంది.

కిషోర్ తన కుటుంబంతోపాటు తాడిపత్రి వదిలిపెట్టి పోవాలని, లేకుంటే చంపేస్తామని టీడీపీ నేతలు బెదిరింపు చర్యలకు పాల్పడినట్టు సమాచారం. కాగా, టీడీపీ నేతల దాడిలో గాయాలపాలైన ఐదుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

Advertisement
Advertisement