ఎన్నికల అధికారులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం | Sakshi
Sakshi News home page

ఎన్నికల అధికారులపై టీడీపీ నాయకుల దౌర్జన్యం

Published Wed, Apr 3 2019 1:18 PM

TDP Leaders Threats to Election Officers in Chittoor - Sakshi

గుడుపల్లె: ఎన్నికల విధుల నిమిత్తం వెళ్తున్న సెక్టారు అధికారులపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. వివరాలు..మంగళవారం కుప్పం నుంచి కుప్పిగానిపల్లె, దాసిమానుపల్లె, పొగురుపల్లె పోలింగ్‌ స్టేషన్లను తనిఖీ చేసేందుకు సెక్టారు అధికారులు వెళ్లారు. మార్గమధ్యంలోని అగరం క్రాస్‌ వద్ద ఉన్న టీడీపీ జెండాలను తొలగించాలని ఎన్నికల అధికారులు సూచించడంతో ఆగ్రహించిన టీడీపీ నాయకులు వారిమీదకు దూసుకెళ్లి దౌర్జన్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా తమ ఇష్టం వచ్చిన చోట ఎక్కడైనా జెండాలు వేసుకుంటామంటూ దురుసుగా ప్రవర్తించారు. ఎక్కువ మంది టీడీపీ కార్యకర్తలు తమ కారును చుట్టుముట్టడంతో చేసేదేమీ లేక అధికారులు అక్కడి నుంచి నిష్క్రమించారు.

Advertisement
Advertisement