తెలంగాణలో టీడీపీకి తెలంగాణ వ్యక్తే అధ్యక్షుడు | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టీడీపీకి తెలంగాణ వ్యక్తే అధ్యక్షుడు

Published Thu, Oct 24 2013 7:23 PM

తెలంగాణలో టీడీపీకి తెలంగాణ వ్యక్తే అధ్యక్షుడు - Sakshi

శ్రీరాంపూర్: ప్రత్యేక రాష్ర్టం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ర్టంలో తెలంగాణ వ్యక్తే ఉంటారని ఆదిలాబాద్ ఎంపీ రమేశ్ రాథోడ్ స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కిరణ్ తన తమ్ముడికి దోచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు.

లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ ఒక్కరికి కూడా సరిగా ఉద్యోగం ఇప్పించలేదన్నారు. తాను ఏ పార్టీలో చేరనని ఉంటే టీడీపీలోనే ఉంటానని తప్పితే వ్యవసాయం చేసుకుంటాను తప్ప.. మరే పార్టీలో చేరమన్నారు. బీజీపీకే టీడీపీ అవసరమన్నారు. టీడీపీ విడిచివెళ్లిన వారందరు తిరిగి వస్తే స్వాగతిస్తామన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉండి డబ్బులు వసూలు చేస్తాడని ఆరోపించారు.

Advertisement
Advertisement