సాక్షి, రాజమండ్రి : కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశంపై ప్రభుత్వం ఇప్పట్లో ఎటువంటి నిర్ణయమూ తీసుకునే సూచనలు కనిపించడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జన్మభూమి సభల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఉన్నవాటిని ఎలా తగ్గించాలా అని చూస్తున్న ప్రభుత్వం, కొత్త కార్డుల జారీపై ఏ నిర్ణయమూ తీసుకునే పరిస్థితి ఉండదని తెలుస్తోంది. జన్మభూమి గ్రామసభల్లో రేషన్ కార్డుల కోసం 1.06 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంతకుముందు నేరుగా వచ్చిన మరో 25 వేల వరకూ దరఖాస్తులు రెవెన్యూ కార్యాలయాల్లో మగ్గుతున్నాయి. ఇలా జిల్లావ్యాప్తంగా మొత్తం 1.31 లక్షల మంది కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. ఇటీవల పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ కొత్త కార్డుల మాట ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు.
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జారీ చేసిన తెల్ల కార్డులను తగ్గించేందుకు ప్రస్తుత ప్రభుత్వం సర్వేలు, తనిఖీలు చేపడుతోంది. జిల్లాలో సుమారు 15 లక్షల కార్డులుండగా వివిధ కారణాల తో వాటిలో ఇప్పటికే సుమారు 60 వేలు తొలగించారు. అలాగే సుమారు లక్ష కార్డులకు సరిపోయేలా ఆరు లక్షల మంది రేషన్ నిలిపివేశారు. ఉన్న కార్డులు తీసేయడం తప్ప ఒక్క కొత్త కార్డు కూడా ఇచ్చేది లేదని అధికారులు చెబుతున్నారు. మరోపక్క గత ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో కార్డుల కోసం వచ్చిన సుమారు 50 వేలు పైగా దరఖాస్తులు అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నాయి. వీటి మాటేమిటని అడిగితే, మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
అందని ద్రాక్షే..
Published Tue, Nov 25 2014 12:00 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement