పెళ్లి ఇష్టం లేదని.. | Sakshi
Sakshi News home page

పెళ్లి ఇష్టం లేదని..

Published Wed, May 3 2017 9:45 AM

పెళ్లి ఇష్టం లేదని.. - Sakshi

► ఉపాధ్యాయురాలి బలవన్మరణం

మోర్తాడ్‌(బాల్కొండ): పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మోర్తాడ్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై అశోక్‌రెడ్డి కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం అడవిరాజు పాలెం గ్రామానికి చెందిన దంపతులు ఉపాధి కోసం మోర్తాడ్‌కు వలస వచ్చారు. ఇక్కడే ఉంటూ జ్యూస్‌స్టాల్‌ నడుపుతున్నారు. వారి కూతురు మద్దసాని మౌనిక (27) ప్రకాశం జిల్లాలోని యంత్రవల్లి గ్రామం పుల్లచెరువు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.

వేసవి సెలువులు కావడంతో ఆమె మోర్తాడ్‌లో ఉండే తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అయితే, కూతురికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు, బంధువులు సంబంధాలు వెతుకున్నారు. తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనను ఎవరికో కట్టబెట్టాలని యత్నిస్తున్నారని కుమిలిపోయిన మౌనిక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది.

మధ్యాహ్నం వచ్చిన తల్లిదండ్రులు ఎంతసేపు పిలిచినా తీయకపోవడంతో చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా మౌనిక వేలాడుతూ కనిపించింది. దీంతో వారు కన్నీరుమున్నీరయ్యా రు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆర్మూర్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement