త్వరలో తిరునాల. పండగలా చేసుకోవాలి. బంధువులను పిలుచుకోవాలి. నాలుగు రాళ్లు చేతిలో ఉంటే మేలు. ఊర్ల పనుల్లేవు. పక్క ఊర్లకైనా ఎల్లాల అనుకుంటుండగా.. గని గ్రామంలో మిరప పండు తెంచేందుకు పని దొరికింది. గడివేముల మండలం ఉండుట్ల గ్రామానికి చెందిన 36 మంది శుక్రవారం ఉదయమే ట్రాక్టర్లో పయనమైనారు. కొంత దూరం పోయినాక ట్రాక్టర్ బోల్తా పడటంతో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోగా.. మరో ఇద్దరు మహిళలు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకునే లోపు మరణించారు. తెల్లారితే మహిళా దినోత్సవం. ప్రపంచమంతా ఆ ఏర్పాట్లలో ఉండగా.. బతుకు బాటలో ముగ్గురు మహిళలు మృత్యువొడి చేరడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
కర్నూలు(హాస్పిటల్), న్యూస్లైన్: కర్నూలు సర్వజన వైద్యశాల క్యాజువాలిటీ శుక్రవారం ఉదయం క్షతగాత్రులతో కిక్కిరిసింది. గడివేముల మండలం ఉండుట్ల గ్రామ సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో గాయపడిన వారితో ఆసుపత్రి నిండిపోయింది. క్యాజు వాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజు ఆధ్వర్యం లో జూనియర్ వైద్యులు, నర్సులు క్షతగాత్రులకు వైద్యం ప్రారంభించారు. పడకలు సరిపోకపోవడంతో ఒక్కోదానిపై ఇద్దరిచొప్పున వైద్యం చేయాల్సి వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల వరకు క్యాజువాలిటీలో క్షతగాత్రుల ఆర్థనాదాలు మిన్నంటాయి.
క్షతగాత్రులను పరామర్శించిన గౌరు దంపతులు
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులను వైఎస్ఆర్సీపీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పార్టీ పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి పరామర్శించారు. బాధితులంతా నిరుపేదలే కావడంతో ఆదుకోవాలని అధికారులను కోరారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బాధితులను తెలుగుదేశం పార్టీ నాయకులు కేజే రెడ్డి, రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బెరైడ్డి రాజశేఖరరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పరామర్శించారు.
పని బాట..కన్నీటి మూట
Published Sat, Mar 8 2014 3:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement