కాశీ విశ్వనాథ్‌కు కన్నీటి వీడ్కోలు | Sakshi
Sakshi News home page

కాశీ విశ్వనాథ్‌కు కన్నీటి వీడ్కోలు

Published Thu, Dec 24 2015 12:55 AM

కాశీ విశ్వనాథ్‌కు కన్నీటి వీడ్కోలు - Sakshi

డాబాగార్డెన్స్(విశాఖపట్నం): ప్రఖ్యాత సినీ రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త శిలుకోటి కాశీ విశ్వనాథ్ అంత్యక్రియలు బుధవారం విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ హిందూ శ్మశానవాటికలో జరిగాయి. ఖమ్మం నుంచి మంగళవారం అర్ధరాత్రి కాశీవిశ్వనాథ్ పార్థివ దేహాన్ని  విశాఖ తీసుకొచ్చారు. బుధవారం ఉదయం బంధువులు, అభిమానులు, పలువురు ప్రముఖులు కాశీవిశ్వనాథ్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపారు.

ప్రముఖ రచయిత, నటుడు గొల్లపూడి మారుతీరావు, రంగస్థల నటుడు మిశ్రో, నట శిక్షకుడు సత్యానంద్ తదితర నాటక, సినీ రంగ ప్రముఖులు, కళాకారులు, రచయితలు, బంధుమిత్రులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement