కేసీఆర్, చంద్రబాబు అలయ్ బలయ్ | Sakshi
Sakshi News home page

కేసీఆర్, చంద్రబాబు అలయ్ బలయ్

Published Mon, Oct 6 2014 12:59 AM

కేసీఆర్, చంద్రబాబు అలయ్ బలయ్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఔను.. వారిద్దరూ మరోసారి కలుసుకున్నారు! తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఎదురుపడి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కుశల ప్రశ్నలు వేసుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ జలవిహార్‌లో ఆదివారం నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం ఇందుకు వేదికైంది. వీరిద్దరూ వేదికపై ఒకే సమయంలో లేకపోయినా... ఒకరు వెళ్తూ (కేసీఆర్).. మరొకరు వస్తూ (చంద్రబాబు).. సభాస్థలి బయట తారసపడి ఆలింగనం చేసుకున్నారు. దత్తాత్రేయ సమక్షంలో ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్‌తోపాటు రెండు రాష్ట్రాల ప్రముఖులు పాల్గొన్నారు.

 

ఇక పార్టీ మారతారని వార్తల్లో ఉంటున్న టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ మొదట తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలసి వేదికపైకి వచ్చారు. కేసీఆర్ వెళ్లిన అనంతరం చంద్రబాబునాయుడితో కలసి సభాస్థలికి రావడం విశేషం.

Advertisement
Advertisement