పార్లమెంట్‌లో ‘ప్రత్యేక’ బిల్లు ప్రవేశపెట్టాలి | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌లో ‘ప్రత్యేక’ బిల్లు ప్రవేశపెట్టాలి

Published Mon, Aug 26 2013 4:44 AM

telangana bill in parliament

 కరీంనగర్ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : పార్లమెంట్‌లో వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరుతూ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం తెలంగాణ చౌక్ నుంచి అమరవీరుల స్తూపం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బాబూ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. ఐదు దశాబ్దాల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని గుర్తించి సీడబ్ల్యూసీ, యూపీఏ మిత్రపక్షాలు తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు సానుకూల ప్రకటన చేయగా సీమాంధ్రులు కృత్రిమ ఉద్యమంతో అడ్డుకోవాలని చూడడం సరికాదన్నారు. 
 
 హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్నే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, ఈవిషయంలో సీమాంధ్రులు సహకరించాలని కోరారు. సీమాంధ్ర ప్రాంతంలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులపై దాడిని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత శ్రీనివాసరావు, ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్‌రెడ్డి, కరీం, కోశాధికారి సిద్ధారెడ్డి, ఎస్జీఎఫ్ కార్యదర్శి మహేందర్‌రావు, పెటా సంఘం రాష్ట్ర బాధ్యులు సంపత్‌రావు, లక్ష్మణ్, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణ, రాజేందర్, వ్యాయామ ఉపాధ్యాయులు బిట్ర శ్రీనివాస్, యూనిష్‌పాషా, రమణ, హరికిషన్, రామానందతీర్థ, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement