భద్రాచలం, న్యూస్లైన్:జిల్లాలోని ఏ ఒక్క గ్రామా న్నీ వదులుకునేది లేదని కేంద్ర మంత్రి పోరిక బలరామ్ నాయక్ అన్నారు.ఆయన మంగళవారం భద్రాచలంలో జరిగిన పార్టీ డివిజన్స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. పోలవరం ముంపు పరిధిలోని అన్ని గ్రామాలు తెలంగాణలోనే ఉం టాయన్నారు. ‘పోలవరం’ నిర్వాసితులకు తెలంగాణ రాష్ట్రంలోనే పునరావాసం కల్పిస్తామన్నారు. పోలవరం విషయంలో సీపీఎం రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నదని ఆరోపించారు.
ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కట్టవద్దని పోరాడుతున్న సీపీఎం.. పార్లమెంటులో ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ‘పోలవరం ముంపు ప్రాంతా లు కూడా తెలంగాణలోనే ఉంటాయని మీరు చెబుతున్నారు. కానీ, 134 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు కదా..!’ అని విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు మంత్రి తడబడ్డారు. తమ ఒత్తిడితోనే ముంపు మండలాల విలీనం ఆర్డినెన్స్ ఆగిపోయిందన్నారు. వచ్చే ప్రభుత్వం అంగీకరిస్తేనే ముంపు మండలాల విలీనం జరుగుతుందని, లేదంటే ఆ గ్రామాలన్నీ తెలంగాణలోనే ఉంటాయని అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు కమిటీ వేయనున్నట్టు చెప్పారు.
పోరికపై జైరాం రమేశ్ అసంతృప్తి
విలేకరుల సమావేశానికి ముందు.. పోరిక బలరామ్నాయక్కు మరో కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ ఫోన్ చేశారు. వారిద్దరి సంభాషణనుబట్టి.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా పత్రికల్లో వచ్చిన కథనాలపై జైరాం అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా అర్థమైంది. దీనికి అనుగుణంగానే బలరామ్ నాయక్ సంజాయిషీ ఇచ్చుకున్నారు. తాను అలా అనలేదని, పత్రికల్లోనే తప్పుగా వచ్చిందని చెప్పారు.
ఒక్క గ్రామాన్నీ వదులుకోం
Published Wed, Mar 12 2014 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
4 రోజులు సిట్ కస్టడీ
కాల్చివేసిన మహిళ మృతదేహం గుర్తింపు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
హడలెత్తిస్తున్న అగ్ని ప్రమాదాలు
పంటల బీమా వర్తించలేదని రైతుల నిరసన
లాభం చూపెట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు
వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండి
హోసూరు వార్తలు..
పాఠశాలల అభివృద్ధి ఇలా...
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement