నృసింహుని సన్నిధిలో తెలంగాణ ఐజీ | Sakshi
Sakshi News home page

నృసింహుని సన్నిధిలో తెలంగాణ ఐజీ

Published Mon, Aug 18 2014 2:01 AM

నృసింహుని సన్నిధిలో తెలంగాణ ఐజీ - Sakshi

మంగళగిరి: మంగళగిరిలో వేంచేసియున్న శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారిని తెలంగాణా ఐజీ నవీన్ చంద్ కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఐజీ కుటుంబ సభ్యులకు అర్చక స్వాములు  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఎగువ, దిగువసన్నిధిల్లోని స్వామి వార్లను, అమ్మవార్లను  దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పట్టణ సీఐ రావూరి సురేష్‌బాబు మర్యాదపూర్వకంగా ఐజీ కుటుంబ సభ్యులను కలిశారు.

Advertisement
 
Advertisement