బిల్లులో సవరణలపై ఎంపీలకు అవగాహన కల్పించాలని నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లులో సవరణలు చేయాల్సిన అంశాలపై పార్లమెంటరీ పార్టీల నేతలకు, ఎంపీలకు వచ్చే నెల 7వ తేదీన వర్క్షాప్ను నిర్వహించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్లో టీ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అధ్యక్షతన జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అన్ని పార్టీల పార్లమెంటరీ విభాగాల నేతలతో, ఎంపీలతో 7న ఢిల్లీలో వర్క్షాపును నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అందులో హైదరాబాద్ శాంతిభద్రతలపై గవర్నర్కు అధికారాలు, ఉద్యోగుల విభజన, విద్య, నీరు, విద్యుత్, హైకోర్టు వంటివాటిని ముఖ్యమైన 5 అంశాలుగా క్రోడీకరించి.. ఒక్కో అంశంపై గంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, రిఫరెన్సులతో అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఫిబ్రవరి 2న జేఏసీ బృందం వరంగల్ జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లి... తెలంగాణ బిల్లు ఆమోదం పొందాలని మొక్కుకోనుంది.
కాగా.. సమావేశం అనంతరం జేఏసీ నేతలు కోదండరాం, శ్రీనివాస్గౌడ్ తదితరులు మాట్లాడుతూ... సీఎం కిరణ్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సీమాంధ్రలో రాజకీయ ప్రయోజనాల కోసమే కిరణ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బిల్లును వెనక్కి పంపడం సాధ్యం కాదని లోక్సత్తా అధ్యక్షుడు జేపీకి తెలియదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే సీఎం కిరణ్ను చంద్రబాబు, జేపీలు నిలదీయాలని డిమాండ్ చేశారు. కాగా.. టీఆర్టీయూ రూపొందించిన డైరీని జేఏసీ నేతలు ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
7న ఢిల్లీలో టీజేఏసీ వర్క్షాప్
Published Wed, Jan 29 2014 1:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement