జహీరాబాద్, న్యూస్లైన్:
సీమాంధ్ర నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఖాయమని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ సి.విఠల్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో పల్లెసీమల పునర్నిర్మాణం అవుతాయని ఆయన అన్నారు. ఆదివారం జహీరాబాద్లో రైతు సంఘం నాయకుడు ఢిల్లీ వసంత్ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భారత్ సందేశ్ సమితి’ ఆవిర్భావ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇంకా ఎంతో దూరంలో లేదన్నారు. విధ్వంసం లేని అభివృద్ధినే ప్రజలు కోరుకుంటారని, కాని ప్రస్తుతం విధ్వంసాలతో కూడుకున్న అభివృద్ధియే కనపడుతోంద న్నారు. పరిశ్రమల ఏర్పాటు పేరుతో సెజ్ల ప్రతిపాదన ముందుకు వస్తోందన్నారు. దీంతో వ్యవసాయ రంగం విధ్వంసానికి దారి తీస్తోందన్నారు. హైదరాబాద్ ప్రాంతంలో హైటెక్సిటీ ఏర్పాటు వల్ల ఎందరో భూములను కోల్పోయారన్నారు. ఇది రైతులకు ఏ మాత్రం లాభం చేకూర్చక పోగా, బడా బాబులకే లబ్ధి చేకూరిందన్నారు. ప్రస్తుతం జహీరాబాద్ ప్రాంతానికి కూడా పరిశ్రమలు రాబోతున్నాయని, దీంతో సెజ్లు వచ్చి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతిని, వ్యవసాయరంగాన్ని దెబ్బతీయకుండా జరిగే అభివృద్ధే నిజమైన అభివృద్ధి అన్నారు. ఎక్కడి వారికి అక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజల అవసరాలను తీర్చే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందడం మూలంగానే అన్నా హజారే, కేజ్రీవాల్లాంటి వారు పుట్టుకువస్తున్నారన్నారు. నేటి యువతే భవిష్యత్తు నిర్దేశకులన్నారు. గ్రామ స్వరాజ్యంతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. రైతు సంఘం నాయకుడు ఢిల్లీ వసంత్ బృందం భారత్ సందేశ్ సమితి ఏర్పాటు చేసి జహీరాబాద్ నియోజకవర్గాభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
కొత్త ఏడాదిలో అనేక పెనుమార్పులు: బోయినిపల్లి హన్మంత్రావు
ఈ ఏడాది దేశ రాజకీయాలలో అనేక పెనుమార్పులు వచ్చే అవకాశాలున్నాయని భారత స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వేదిక అధ్యక్షుడు బోయినిపల్లి హన్మంత్రావు అన్నారు. చరిత్ర మలుపు యువత చేతుల్లో ఉందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సైతం చారిత్రక సంఘటనలు జరగే అవకాశం లేకపోలేదన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సంస్థ తరఫున అభ్యర్థులను పోటీకి నిలుపుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ప్రొఫెసర్లు తిరుమలి, మల్లేష్, సంఘ సేవకుడు పండిత్ సుదర్శన్ స్వామి, టీ జేఏసీ నాయకులు శ్యాం, రఘురంజన్, రాంచందర్ భీంవంశీ, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎల్.జనార్ధన్, రైతు సంఘం నాయకుడు ఢిల్లీ వసంత్, భారత్ సందేశ్ సమితి నాయకులు సి.అంజి, కుత్బుద్దీన్, ప్రశాంత్, రవీందర్రెడ్డి, మహేష్వర్ధన్రెడ్డి, జి.అమిత్కుమార్, రాములునేత, శంకర్, శ్రీనివాస్, వేణు పవార్, పాండు రాథోడ్, ప్రేమ్సింగ్, తారానాయక్లు పాల్గొన్నారు.
‘తెలంగాణ’ ఖాయం
Published Sun, Jan 5 2014 11:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement