శ్రీకాకుళం సిటీ: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే ప్రధాన కారణమని, వారి ఆలోచనలు, సూచనల మేరకు ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు చెప్పారు. గురువారం ఆయన స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ నెల 17, 18 తేదీల్లో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటిస్తారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో పాలన గాడిలో పడాల్సి ఉందన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి కలెక్టర్ 90 సెంట్ల భూమి కేటాయించారని, ప్రతి కార్యకర్త గర్వపడేలా భవనం నిర్మిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రదర్శించిన వైఖరి సరిగా లేదన్నారు.
విధాన నిర్ణయాలు వ్యతిరేకించే అధికారుల భరతం పడతాం:కూన
ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ అధికారులెవరైనా సరే టీడీపీ ప్రభుత్వ పరంగానే పనిచేయా ల్సి ఉంటుందని, అలాకాకుండా పార్టీ విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తే వారి భరతం పడతామని హెచ్చరించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని చెప్పారు. ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ జిల్లా సమర్థులకే పార్టీ పదవులు కట్టబెట్టిందని, జిల్లా ప్రగతి పథం పడుతుందని పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయానికి తన తండ్రి ఎర్రన్నాయుడు పేరు పెట్టాలని కోరారు. చౌదరి బాబ్జీ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ వైభవానికి దివంగత ఎర్రంనాయుడే కారణమని, జిల్లాకు, పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని తీర్మానం చేశామన్నారు. అంతకుముందు పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ పదేళ్లుగా ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలని కోరారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ధనలక్ష్మి, శ్రీకాకుళం, నరసన్నపేట, ఇచ్ఛాపురం ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబునాయుడు, మాజీ ఎమ్మెల్యేలు దువ్వాడ నాగావళి, తలే భద్రయ్య, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జిలు శత్రుచర్ల విజయరామరాజు, నిమ్మక జయకృష్ణ, జిల్లా పార్టీ ముఖ్యులు పి.వి.రమణ, పేర్ల గోవిందరాజులు, జామి భీమశంకర్, గొండు వెంకటరమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల అభీష్టం మేరకే పాలన
Published Fri, Sep 12 2014 2:02 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పిడుగుపడి 48 గొర్రెలు మృతి
బీసీలను విస్మరించారు.. ఓటుతో సత్తా చాటుతాం
గెలిచే సీట్లలో నాగర్కర్నూల్ ఒకటి..
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం
కాంగ్రెస్తోనే వికలాంగుల సంక్షేమం..
ఎన్నికల విధులపై అవగాహన అవసరం
నేడు కేటీఆర్ రోడ్షో
బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఆందోళన
కొలతల ప్రకారం‘ఉపాధి’ పనులు చేపట్టాలి
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement