కామారెడ్డి, న్యూస్లైన్: టీడీపీ ఇచ్చిన లేఖతోనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినమని కేంద్ర హోంమంత్రిషిండే, దిగ్విజయ్ సింగ్లు చెబుతుంటే కేసీఆర్ మాత్రం టీడీపీని భూస్థాపితం చేసేందుకు కుట్రలు చేస్తున్నాడని టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. జహీరాబాద్ పార్లమెంటు నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జి మదన్మోహన్రావ్ చేపట్టిన జనచైతన్య సైకిల్యాత్ర గురువారం కామారెడ్డిలో ముగిసింది. ఈ సందర్భంగా స్థానిక గాంధీగంజ్లో నిర్వహించిన బహిరంగ సభలో దయాకర్రావు మాట్లాడారు.
తామిచ్చిన లేఖతో తెలంగాణ రాలేదని కేసీఆర్ నిరూపిస్తే ముక్కు నేలకురాస్తామని సవాల్ విసిరారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వాల్సిందేనని, యూటీగీటీ అంటే సహించేది లేదన్నారు. తమ పార్టీని రెండు ప్రాంతాల్లో కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఉందని, అందుకే ఆయన ఇరు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా సమస్యను పరిష్కరించాలని మాట్లాడాడని పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేశ్ సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము చంద్రబాబును డిమండ్ చేసినట్టు తెలిపారు. టీడీపీ తెలంగాణకు వ్యతి రేకమని ఎవరైనా అంటే గల్లాబట్టి గుం జుండ్రని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో వేయి మందిని బలితీసుకున్న కాంగ్రెస్ పార్టీకి విజయోత్సవాలు జరుపుకునే హక్కులేదన్నారు. అమరుల కుటుంబాల కాళ్లపై పడి క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. టీడీపీ వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు.
తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉంది...
-ఎమ్మెల్యే మండవ
తెలంగాణ ఏర్పాటు విషయంలో తమ పార్టీ ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని పదేపదే ప్రకటించామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితీరుతుందని ఎమ్మెల్యే మం డవ అన్నారు. కాంగ్రెస్ నేతలే తెలంగాణకు వ్యతిరేకమన్నారు. తెలంగాణ ప్రకట న తరువాత సీమాంధ్రలో ప్రజలను రెచ్చగొట్టింది కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రేనని అన్నారు. యువకులు టీడీపీలో చేరాలని కోరారు.
టీడీపీ లేఖతోనే తెలంగాణ...
-మాజీ మంత్రి బాబూమోహన్
టీడీపీ ఇచ్చిన లేఖతోనే తెలంగాణ వచ్చిం దని, ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాల ని మాజీ మంత్రి బా బూమోహన్ కోరారు. మదన్మోహన్ 26రోజుల పాటు ని ర్వహించిన సైకిల్యాత్ర అభినందనీయమన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా పని చేసిన తర్వాతనే బీడీ కార్మికులకు కష్టాలు వచ్చాయని అన్నారు. కేసీఆర్ కుటంబం వందల కోట్ల రూపాయలకు అధిపతులయ్యారని విమర్శించారు.
సైకిల్ యాత్ర స్ఫూర్తిదాయకం...
-ఎమ్మెల్యే ఎల్.రమణ
మదన్మోహన్ నిర్వహించిన సైకిల్ యాత్ర స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే రమణ అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నంలో ఆయన చేపట్టిన యాత్ర విజయవంతమైందన్నారు.
ప్రజలకు సేవచేసేందుకే యాత్ర చేశా..
-మదన్మోహన్రావ్, జహీరాబాద్ టీడీపీ ఇన్చార్జి
ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తా ను నియోజక వర్గంలో 26 రోజుల పాటు సైకిల్యాత్ర చేశానని మదన్మోహన్రావ్ అన్నారు. 373 గ్రామాలు తిరిగిన తాను ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలు ఏవగించుకుంటున్నారని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధిఅవకాశాలు లేక యువకులు పడుతున్న ఇబ్బం దులకు పరిష్కారం టీడీపీ పాలనలోనే సాధ్యమని తెలిపారు. సభలో ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, వీజీగౌడ్, బద్యానాయక్, సభ కు అధ్యక్షత వహించిన నియోజక వర్గ ఇన్చార్జి నిట్టు వేణుగోపాల్రావ్ మాట్లాడారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు నజీరొద్దిన్, చీల ప్రభాకర్, ఆనంద్, కుంబాల రవి, మహేశ్, పాషా, ఉస్మాన్ పాల్గొన్నారు.
టీడీపీ లేఖతోనే ‘తెలంగాణ’
Published Fri, Nov 15 2013 5:57 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలు.. ట్రై చేయండిలా..!
డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్
టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
పెళ్లి కోసం అబ్బాయిని తీసుకెళ్లినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు: అంజలి
ఈ మినీ మెషిన్తో.. స్కిన్ సమస్యలకు చెక్!
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
తప్పక చదవండి
- టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
- చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
- Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
- బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్కు నివ్వెరపోయారు
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement