ఇరు రాష్ట్రాలకూ పరీక్షా సమయమిది
నిర్వహణ వ్యయమే తడిసిమోపెడు
అభివృద్ధి ప్రణాళికకు మిగిలేది అరకొరే
శాఖలను, విభాగాలను కుదించుకోవాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో పాలకులు ముందుచూపుతో వ్యవహరించి జాగ్రత్త పడకపోతే రెండు రాష్ట్రాలూ అప్పుల ఊబిలో కూరుకుపోతాయంటూ ఉన్నతాధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు నిర్వహణ వ్యయం తడిసిమోపెడు అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. ఫలితంగా విభజన తర్వాత కొన్నేళ్ల పాటు ఇరు రాష్ట్రాల ఆదాయంలో అత్యధిక మొత్తం ప్రభుత్వ నిర్వహణ వ్యయానికే సరిపోతుందని, అభివృద్ధికి ప్రాణ సమానమైన ప్రణాళికకు పెద్దగా నిధులు మిగలవని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్లో మూడింట రెండొంతులు నిర్వహణకు, ఉద్యోగుల జీతభత్యాలకే పోతోంది. ‘‘ఈ దృష్ట్యా విభజన తర్వాత రెండు ప్రభుత్వాలూ నిర్వహణ వ్యయాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టాలి. అలాగాక సమైక్య రాష్ట్రంలో ఉన్న శాఖలు, కార్పొరేషన్లన్నీ కొనసాగాల్సిందేననుకుంటే కొన్నేళ్ల పాటు ఇరు రాష్ట్రాలూ
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల పాలవుతాయి. అప్పుల ఊబిలోకీ కూరుకుపోతాయి’’ అంటున్నారు. రెండు రాష్ట్రాలకూ వారు చెబుతున్న జాగ్రత్తలివే...
శాఖలు, కార్పొరేషన్లు, ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన రెండు రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేస్తుంది. కానీ తమకు ఎన్ని శాఖలు, ఏ కార్పొరేషన్లు అవసరమో, ఏవి అనవసరమో ఇరు రాష్ట్రాలూ ఆలోచించుకోవాలి. ఉదాహరణకు తెలంగాణకు ఓడ రేవుల శాఖ అనవసరం
కొత్త సహకార చట్టం ప్రకారం సహకార సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. కానీ ఆ సంస్థల్లో సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. వారిని తగ్గించుకోవచ్చు. పైగా సహకార శాఖను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఉండదు
ఆర్థిక శాఖలో ప్రస్తుతం ఐదుగురు ముఖ్య కార్యదర్శులున్నారు. రెవెన్యూ శాఖలో ముగ్గురు, మున్సిపల్ శాఖలో ఇద్దరున్నారు. కొత్త రాష్ట్రాలకు అన్ని పోస్టుల అవసరముండదు
ఏ ప్రయోజనమూ లేని ప్రభుత్వ రంగ సంస్థలు కొన్నున్నాయి. వాటిలో మరీ అవసరమనుకున్న వాటిని ఉంచి మిగతా వాటిని వదిలించుకోవాలి
ప్రస్తుతం పలు శాఖలు, విభాగాల్లో సిబ్బంది అవసరానికి మించి ఉన్నారు. అవసరమైన దానికంటే తక్కువ సిబ్బంది ఉన్న శాఖల్లోకి వారిని సర్దాలి
జనాభా పెరుగుదల గణనీయంగా తగ్గిపోతోంది. 2.1 శాతం ఉండాల్సిన సంతానోత్పత్తి ప్రస్తుతం రాష్ట్రంలో 1.75 శాతానికి పడిపోయింది. దీనివల్ల మున్ముందు ఎక్కువ పాఠశాలల అవసరం ఉండదు. కాబట్టి ఇప్పట్లా పేటకో పాఠశాలను కొనసాగించడం అనవసరం. అలాగాకుండా నిజంగా అవసరమైన చోటే మంచి స్కూలు ఏర్పాటు చేయాలి
వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పదేళ్ల క్రితం జనాభాలో వారు 4 శాతం ఉండేది. ఇప్పుడది రెట్టింపైంది. అంటే 8 శాతానికి పెరిగింది. కాబట్టి ఆ మేరకు పింఛన్ భారం, ఆరోగ్య సేవల వ్యయం వంటివీ పెరుగుతాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి.
ముందున్నది అప్పుల ఊబే!
Published Mon, Feb 24 2014 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement