పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సాప్లో సోషల్–1 పేపర్
కడప ఎడ్యుకేషన్/కాశినాయన/ పోరుమామిళ్ల: పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కొనసాగుతూనే ఉంది. మంగళవారం జరిగిన సోషల్ పేపర్–1 ప్రశ్నపత్రం కూడా లీకైంది. ఉదయం 10 గంటలకల్లా వాట్సాప్లో ప్రశ్నపత్రం దర్శనమివ్వడంతో జిల్లాలో కలకలం రేగింది. వైఎస్సార్ జిల్లా నరసాపురంలోని పరీక్ష కేంద్రం నుంచి ఈ ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు తెలిసింది. ఈ ప్రశ్నపత్రం ఆధారంగా పలు కేంద్రాలకు బయట నుంచి సమాధానాలు పంపించినట్లు సమాచారం. దీనిపై డీఈవో శైలజను వివరణ కోరగా.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు నరసాపురం పరీక్ష కేంద్రాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. చీఫ్ సూపరింటెండెంట్ సుబ్బారావు, హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఇన్విజిలేటర్లను విచారిస్తున్నారు.
విలేకరిపై పోలీసు జులుం: నరసాపురం పరీక్షా కేంద్రం నుంచి సోషల్–1 ప్రశ్నపత్రం లీక్ అయ్యిందం టూ ఓ చానల్(సాక్షి కాదు)లో ఉదయం 9.45 గంటలకు బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. దీంతో పోరుమామిళ్ల వచ్చిన మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు.. ఆ చానల్ విలేకరి గోపాల్రెడ్డిని స్టేషన్కు పిలిపించారు. ప్రశ్నపత్రం ఎలా బయటకొచ్చింది? అసలు ఆ పేపర్ నీ చేతికి ఎలా వచ్చింది? అంటూ గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. ఎస్సై పెద్ద ఓబన్న అయితే ఏకంగా విలేకరి నుంచి ఫోన్ లాగేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన స్థానిక విలేకరులు పోలీస్స్టేషన్కు చేరుకోవడంతో గోపాల్రెడ్డిని వదిలివేశారు. కానీ అతని ఫోన్ మాత్రం వారి వద్దే అట్టిపెట్టుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ విలేకరులంతా స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో ఎస్సై ఓబన్న బయటకు వచ్చి విలేకరులకు సర్ది చెప్పారు.
సోషల్ పేపర్–2 ప్రశ్నపత్రం కూడా లీక్!
సాక్షి కడప: ఈనెల 30(గురువారం)న నిర్వహించాల్సిన సోషల్ పేపర్–2 పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రం సైతం లీకైనట్లు తెలిసింది. ఈ ప్రశ్నపత్రం మంగళవారమే బ్రహ్మంగారి మఠం మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చేరినట్లు తెలియడంతో పోలీసులు ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కొనసాగుతున్న ‘టెన్త్’ లీక్
Published Wed, Mar 29 2017 2:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సమస్యలపై నాన్చడం నచ్చదు..
చెల్లెం ఆనందప్రకాష్, రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు
ముస్లింలకు అండగా జగన్
చంద్రబాబు కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది
సంక్షేమం సగం బలం
జగన్కు జైకొట్టిన ఆటో డ్రైవర్లు
ఆ అవినీతిపరుడే గొప్పవాడయ్యారా?
మా గుండెల్లో కొలిచేనేత ఆయన
ఎన్నికల కమిషన్.. చంద్రబాబు జేబు సంస్థా..?
ఆరోగ్యమస్తు
తప్పక చదవండి
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement