మహబూబ్నగర్, సాక్షి ప్రతినిధి: తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు నిర్ణయంపై కాంగ్రెస్పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపేందుకు ఆ పార్టీ నేతలు జైత్రయాత్రలు నిర్వహిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీలు మాత్రం జైత్రయాత్రలు విజయవంతం కాకుండా ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. తెలంగాణపై సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం చకచకా నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో ఇన్నాళ్లూ స్తబ్ధతగా ఉన్న కాంగ్రె స్ నేతలు తామే తెలంగాణ తెచ్చామని చెప్పుకునేందుకు ఈనెల 29న గద్వాలలో జైత్రయాత్ర నిర్వహిస్తున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు.
అందులో భాగంగానే మంత్రి డీకే అరుణతో పాటు జిల్లాకు చెందిన కొంతమంది కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి గద్వాలలో నిర్వహించతలపెట్టిన జైత్రయాత్ర కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందేవరకు ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటును నమ్మలేమని, ఆ తర్వాతనే సంబరాలు చేసుకుందామని టీఆర్ఎస్ నేతలు పదేపదే ప్రకటిస్తున్నారు. ఇదే విషయాన్ని శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సమావేశంలో ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాతే పార్టీ విలీనం గురించి ఆలోచిద్దామంటూ పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం పూర్తికాకుండానే తెలంగాణ వచ్చేసిందనే రీతిలో సంబరాలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులు, విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించినందుకు జైత్ర యాత్రలు చేస్తున్నారా? అంటూ టీఆర్ఎస్ నేతలు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగా పాలు పంచుకోకపోవడంతో జిల్లాలో ఆ పార్టీ వెనకబడిందని చెప్పొచ్చు.
తెలంగాణ ప్రకటన తర్వాత ఆ లోటును పూడ్చుకునే ప్రయత్నంలో భాగంగా నెలన్నర క్రితం విజయోత్సవ సభల పేరుతో ర్యాలీలు, అన్ని ఉద్యోగ సంఘాల నేతలతో ఇటీవల సమావేశాలు నిర్వహించారు. అయినప్పటికీ ఆశించిన మేర కాంగ్రెస్పార్టీకి జనంలో స్పందనరాకపోవడంతో అధిష్టానవర్గం సూచనల మేరకు జైత్రయాత్రలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి తెలంగాణ రాకుండా అడ్డుకుంటామని చెబుతుంటే జైత్రయాత్రలు ఏవిధంగా నిర్వహిస్తారంటూ టీఆర్ఎస్ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.
పాపం ‘తమ్ముళ్లు’!
కాంగ్రెస్, టీఆర్ఎస్ల పరిస్థితి ఇలాఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండు కళ్ల విధానం ఆ పార్టీనేతలకు తలనొప్పిగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కు అనుకూలమంటూనే సీమాంధ్ర ప్రాంతానికి అన్యా యం జరుగుతోందంటూ చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేయ డం జిల్లా నేతలకు మింగుడుపడని పరిస్థితి నెలకొంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా బలహీనపడిందని చెప్పొచ్చు. తమ ఉద్యమాల వల్లే రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ మొదలైందని టీఆర్ఎస్, తమ పార్టీ నిర్ణయం తీసుకోవడం వల్లే రాష్ట్రం ఏర్పాటవుతుందని కాంగ్రెస్ నేతలు హడావుడి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం ఏం చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.
‘జై’ కొడతారా?
Published Sun, Oct 27 2013 3:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement