► సుందరయ్యనగర్, ఫెర్రీ నిర్వాసితుల నుంచి డబ్బుల వసూలు
► కాచవరం కొండల్లో స్థలాల కేటాయింపు
► కనీస సౌకర్యాలు లేవని బాధితుల ఆందోళన
ఇబ్రహీంపట్నం : పుష్కర నిర్వాసితులకు పట్టాల కేటాయింపులో తెలుగు తమ్ముళ్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మండలంలోని సుందరయ్య నగర్, ఫెర్రీ రహదారిలోని ఈ నిర్వాసితులకు కాచవరం గ్రామంలో కేటాయించిన స్థలం కొండలు, గుట్టల మధ్యన ఉండటంతో కనీస సౌకర్యాలు కూడా లేనిచోట నివసించేది ఎలా అని బాధితులు ఆందోళన చెందుతున్నారు.
బాధితులకు అండగా నిలిచిన వైఎస్సార్ సీపీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ నిర్విరామ కృషి చేశారు. పేదలకు స్థలాలు ఇచ్చేలా అధికారులపై వైఎస్సార్ సీపీ పోరాడింది. ఈ క్రమంలో నిర్వాసితులు సుమారు 450 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చి ఇంటింటికి తిరిగి తగిన ఆధారాలతో నివేశన స్థలం పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సుందరయ్యనగర్లో 233 మందికిగాను 92 మందికి, ఫెర్రీ రహదారిలో 213 మందికిగాను కేవలం 65 మందికి మాత్రమే పట్టాలు అందజేసినట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి ఆధారాలు చూపిన అనంతరం పట్టాలు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నారు.
వసూళ్లకు తెరతీసిన తమ్ముళ్లు
పట్టాల కేటాయింపులో అధికారులు ఇంటి పన్నును ప్రామాణికంగా తీసుకోవటంతో టీడీపీ వార్డు సభ్యురాలి భర్త డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడని బాధితులు ఆరోపించారు. పన్ను ఆధారాలు లేనివారికి ఇంటి పన్ను, పట్టా, ప్లాటు కేటాయింపు వరకు మేమే చూసుకుంటామని ఒక్కొక్కరి నుంచి రూ.25 వేల నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నారని అధికార పార్టీ వార్డు సభ్యులే ఆరోపణలు చేయటం గమనార్హం.
కొండలు, గుట్టల్లో స్థలాలు
కాచవరంలోని సర్వే నంబర్ 8లోని 9.30 ఎకరాల కొండ పోరంబోకు స్థలంలో పుష్కర నిర్వాసితులకు 465 ప్లాట్లు ఏర్పాటు చేశారు. పట్టాలున్న వారికి స్థలాలు కేటాయించేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. అయితే కొండలు, రాళ్లగుట్టల మధ్య స్థలాలు కేటాయిస్తే నివాసాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.
నివాసయోగ్యంగా లేదు
ఫెర్రీ రహదారిలో నా ఇం టిని కూల్చేశారు. రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. ఇక్కడకు వస్తే ఇవన్నీ కొండలు, గుట్టల మధ్య స్థలం ఉంది. సౌకర్యాలు లేకపోవడంతో ప్రస్తుతం నివాసయోగ్యంగా లేదు.
- గుమ్మడిదల హనుమంతరావు, నిర్వాసితుడు
ఎడారిని తలపిస్తోంది
పుష్కర బాధితులకు కేటాయించిన స్థలం ఎడారిని తలపిస్తోంది. రాళ్లగుట్టల మధ్య ప్లాట్లు ఏర్పాటు చేశారు. రహదారి సౌకర్యం కూడా సరిగా లేదు. ఇక్కడ ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో తెలియటం లేదు. సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. - చాగంటి దుర్గారావు, నిర్వాసితుడు
పట్టాల పంపిణీలో తమ్ముళ్ల చేతివాటం
Published Sat, May 14 2016 2:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement