జూన్ 2నుంచి వ్యయానికి గవర్నర్ గ్రీన్సిగ్నల్
ఆంధ్రప్రదేశ్కు రూ. 34, 595 కోట్లు
తెలంగాణకు రూ. 26,516 కోట్లు
విభజన ప్రక్రియపై నరసింహన్ సమీక్ష
రాష్ర్ట విభజన చట్ట సవరణకు కేంద్రానికి పలు ప్రతిపాదనలు
సలహా కమిటీ పునర్వ్యవస్థీకరణకు నిర్ణయం
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో జూన్ 2 నుంచి నాలుగు నెలల కాలానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు సంబంధించిన వేర్వేరు బడ్జెట్లను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 34,595 కోట్లు, తెలంగాణకు రూ. 26,516 కోట్లు కేటాయించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల వేతనాలు, ప్రభుత్వ నిర్వహణకు రెవెన్యూ బడ్జెట్ కింద రూ. 28,626 కోట్లు, ఆస్తుల కల్పనకు రూ. 3,882 కోట్లు కేటాయించారు. బడ్జెట్ లోటును ఆ రాష్ర్ట ప్రభుత్వం రుణాల రూపంలో భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రానికి రెవెన్యూ బడ్జెట్ కింద రూ. 21,295 కోట్లు, ఆస్తుల కల్పన కోసం రూ. 3,046 కోట్లు మంజూరు చేశారు. ఇక్కడ కూడా మిగిలిన నిధులను తెలంగాణ ప్రభుత్వం రుణంగా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆదివారం రాజ్భవన్లోని సుధర్మ బ్లాక్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితోపాటు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో గవర్నర్ నరసింహన్ సమావేశం నిర్వహించారు. ఆరు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఇప్పటికే శాసనసభ ఆమోదించిన విషయం విదితమే. కాగా రాష్ర్టపతి పాలన సందర్భంగా రెండు నెలల బడ్జెట్ను వ్యయం చేయగా.. మిగిలిన నాలుగు నెలల కాలానికి ఈ బడ్జెట్ను ఇరు రాష్ట్రాలకు గవర్నర్ కేటాయించారు. కాగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ పదిలో ఉన్న 107 సంస్థలకు అదనంగా మరో 38 సంస్థలను చేర్చి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.
ఇక కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డుకు సంబంధించిన ప్రతిపాదనలు అసంబద్ధంగా ఉన్నట్లు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి.. గవర్నర్ దృష్టికి తీసుకుని వచ్చారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న 16 ప్రాజెక్టుల సమాచారాన్ని షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చలేదన్నారు. నాగిరెడ్డి చేసిన ప్రతిపాదనను కూడా గవర్నర్ ఆమోదించి.. కేంద్రానికి పంపించారు. ఆ మేరకు చట్ట సవరణ చేయాలని కోరనున్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఫైళ్ల విభజన, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని సీఎస్ వివరించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన స్థిర, చరాస్తుల పంపిణీ కూడా పూర్తయినట్లు తెలిపారు. వాహనాల కేటాయింపు ప్రక్రియ కూడా ముగిసిందన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏర్పాటైన కమిటీలన్నీ తమ నివేదికలను అందించాయని, వాటిని కేంద్రానికి పంపిస్తున్నట్లు సీఎస్ చెప్పారు. సలహా, అపెక్స్ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు కూడా ఆయన వివరించారు.
సలహా కమిటీలకు చైర్మన్గా కమలనాథన్ వ్యవహరిస్తారు. సభ్యులుగా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, హోం, ఆర్థిక, న్యాయ శాఖల కార్యదర్శులు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ శాఖ కార్యదర్శి ఉంటారు. అపెక్స్ కమిటీలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కో చైర్మన్లుగా, ప్రణాళిక, హోం, ఆర్థిక, నీటిపారుల, ఇంధన, ఉన్నత విద్య, పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, రెవెన్యూ విభాగాల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. షెడ్యూల్ తొమ్మిదిలోని పరిశ్రమలు, కార్పొరేషన్లు.. వాటి విభజన ప్రతిపాదనలను ముగ్గురు నిపుణుల కమిటీకి ఇవ్వాలని సీఎస్ సూచించారు. అఖిల భారత, రాష్ట్ర సర్వీసు అధికారుల సమస్యలను కూడా ఈ సందర్భంగా సమీక్షించారు. ప్రభుత్వ క్వార్టర్ల విభజన కూ గవర్నర్ ఆమోదం తెలిపారు.
నాలుగు నెలల బడ్జెట్కు ఆమోదం
Published Mon, May 19 2014 1:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement