కోసిగి: మండలంలోని వందగల్లుకు చెందిన చాకలి వెంకటేష్, లక్ష్మి దంపతుల హత్య కేసులో నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ అస్రార్ బాష, ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. పోలీసుల కథనం మేరకు..2007లో గ్రామానికి చెందిన చాకలి ఆనందప్ప, సాతనూరు తిమ్మప్ప కుటుంబాల మధ్య పొలం తగాదాలో ఆనందప్ప హత్యకు గురయ్యాడు. ఆ కేసులో ప్రస్తుతం కోర్టులో తుది విచారణ దశకు వచ్చింది. దీంతో చాకలి వెంకటేష్, లక్ష్మిలను రాజీ కావాలని, సాక్షులు మార్చేందుకు రూ12 లక్షలు వరకు ఇస్తామని, ఆ కేసులో నిందితులు ప్రయత్నించారు.
అయితే రాజీయత్నం విఫలం కావడంతో సెప్టెంబర్ నెల 17న రాత్రి ఆదోని నుంచి రైలులో కోసిగికు వస్తున్న చాకలి వెంకటేష్ను అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నరసింహులు, కోసిగికు చెందిన సాతనూరు మంజునాథ, గోపాల్, తిమ్మరాజుతో పాటు మరో 9మంది కాపు కాచి, గ్రామ శివారులో ఉన్న పొలంలోకి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ అతనికి బలప్రయోగంతో పురుగుల మందు తాగించి హత్య చేశారు. అలాగే ఇంట్లో నిద్రస్తున్న వెంకటేష్ భార్య లక్ష్మిని కూడ నోట్లో మందు పోసి చంపేశారు.
అయితే శవాలను రైల్వే పట్టాల పై పడవేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించేందుకు యత్నించారు. పోస్టుమార్టంలో హత్యగా తేలింది. హతులు వందగల్లు గ్రామానికి చెందినవారుగా రైల్వే పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించి, ఈనెల 6న కోసిగి స్టేషన్కు వివరాలు పంపారు. నిందితులు నాటుగాని నరసింహులు, గోపాల్, తిమ్మరాజు, మల్లారెడ్డి వెంకటేష్, గోవిందు, చాకలి మమాదేవా, ఈడిగ హనుమంతరెడ్డి, దుమతిగోపాల్, అంజినయ్య , జింకల హనుమంతులను సాతనూరు తిమ్మప్ప పొలంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో ముగ్గురు నిందితులు మంజునాథ, కందుకూరు వీరేష్, డుబాబు ఈరన్న పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
హత్య కేసులో నిందితుల అరెస్ట్
Published Wed, Oct 22 2014 2:43 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎంపీ గురుమూర్తి తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
పన్నూ హత్యకు కుట్ర.. అమెరికాపై మండిపడ్డ రష్యా
పిఠాపురంలో సీఎం జగన్ ఎన్నికల సభ
10 వరకూ తత్కాల్లో ఇంటర్ ఫీజుకు అవకాశం
అర్ధరాత్రి పచ్చమూకల బరి తెగింపు
ప్రతిభ ఉంటే.. ఉపకారం మీ వెంటే
ఐటీఐలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
సమస్యాత్మక ప్రదేశాల్లో 800 సీసీ కెమెరాలు
ఓటమి భయంతోనే టీడీపీ దాడులు
సజావుగా పోస్టల్ బ్యాలెట్ రీ పోలింగ్
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement