చిత్తూరు(క్రైమ్), న్యూస్లైన్: క్రికెట్ మ్యాచ్లపై జిల్లాలో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. చాంపియన్స్లీగ్ (సీఎల్ టీ-20) మ్యాచ్లు ఇటు బుకీలతో పాటు అటు జూదప్రియులకు సైతం కాసులు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని మదనపల్లె, చిత్తురు, తిరుపతి ప్రాంతాల్లో బుకీలు మకాం వేసి బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం. లా డ్జీలు, గెస్ట్హౌస్లు, అటవీప్రాంతాలు, పంట పొలాల వద్ద ఉన్న ఫామ్ హౌస్లను బెట్టింగ్కేంద్రాలుగా ఎంచుకొని తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. జట్టు ప్రాముఖ్యత, మ్యాచ్ స్వరూపం, బ్యాటింగ్ బౌలింగ్ విభాగాల్లో దిగ్గజాలను ఎంచుకొని రూ.వెయ్యి నుంచి లక్షలు, కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తున్నారు. అయితే బుకీ కి, హంటర్కు మధ్య ముఖ పరిచయం లేకుండానే బ్యాంకు ఖాతాలు, ఇంటర్నెట్ ద్వారానే బెట్టింగ్ లావాదేవీలు సాఫీగా జరిగిపోతున్నాయి.
రూ.50 వేలు జమ చేస్తేనే..
బుకీలు ఎవరికంటేవారికి బెట్టింగ్కు అవకాశం ఇవ్వరు. ప్రస్తుతం కొనసాగుతున్న బెట్టింగ్లో ఉన్న ఏజెంట్లు కానీ, నమ్మకమైన సభ్యుడు కానీ ఎవరో ఒకరు సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఇలా బెట్టింగ్కు అర్హత పొందిన వారిని ‘హంటర్’ అంటారు.బుకీ అకౌంట్లో రూ.50 వేలు జమచేసిన రోజు నుంచే హంటర్ బెట్టింగ్లో పాల్గొనవచ్చు. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి అర్ధ గంట ముందు ఎంతమంది హంటర్లు బెట్టింగ్కు దిగుతారో బుకీకి ఫోన్ చేసి తెలుపుతారు. ఇంటన్నెట్లో హంటర్లు రూ.5 వేల నుంచి 50 లక్షల వరకు బెట్టింగ్ కాస్తారు. రూ.50 వేలు అంతకు మించి వెచ్చించేవారు డిపాజిట్లు కూడా అంతే స్థాయిలో జమ చేయాల్సి ఉంటుంది. గెలుపొందిన తరువాత బుకీ మరుసటిరోజు 10, 11 గంటల లోపు హంటర్ ఖాతాలో డబ్బు జమ చేస్తాడు. ఒకవేళ హంటర్ ఓడిపోతే వారు కూడా 11 గంటల్లోపు బ్యాంక్ ఖాతాలో ఖచ్చితంగా జమచేయాల్సిందే.
ఒక్కోదానికి ఒక్కో రేటు
ఫోర్, సిక్స్, హాఫ్సెంచరీ, సెంచరీ అంటూ బ్యాట్స్మెన్లపై, బౌలింగ్లో ఫలానా ఓవర్లో ఏ బ్యాట్స్మెన్ ఔట్ అవుతారు అనే వాటిపై బెట్టింగ్కు డబ్బు వెచ్చిస్తారు. మ్యాచ్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చే సత్తావున్న బ్యాట్స్మెన్లు, బౌలర్ల పైనా అధికమొత్తంలో బెట్టింగులకు దిగుతున్నారు. ఫలానా బ్యాట్స్మేన్ ఇన్ని ఫోర్లు, ఇన్ని సిక్సర్లు బాదతాడని ఒక్కోఫోర్, సిక్స్కు రూ.5 వేల నుంచి రూ. 10 వేల వరకు పందెం కాస్తున్నారు. దీంతో పాటు ఈ చాంపియన్స్లీగ్లో హాట్ ఫేవరెట్ జట్లుగా బరిలోకి దిగిన చెన్నై, సన్రైజర్స్, రాజస్థాన్, ముంబై టీములపై రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు పందెంకాసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
పల్లెలకు తాకిన బెట్టింగ్ సెగ
బెట్టింగ్ సెగ నగరాలు, పట్టణాలతో పాటు పల్లెలకు కూడా పాకింది. పల్లెల్లో చెట్లకింద దాయాలు, పేకాట ఆడేవారందరూ క్రికెట్ బెట్టింగ్పై పడుతున్నారు. మొబైల్లో ఇంటర్నెట్, రేడియోల ద్వారా ఎప్పటికప్పుడు స్కోర్లు తెలుసుకుంటూ మోజు పెంచుకుంటున్నారు. పల్లెల్లో రూ.10 నుంచి 50, 100, 200 ఇలా రూ.1000 వరకు వెచ్చించడానికి సిద్ధపడుతున్నారు. మరి కొన్ని బ్యాచ్లు పలమనేరు, శ్రీకాళహస్తి, పీలేరు, పుత్తూరు మొలకలచెరువు ప్రాంతాల్లో జనావాసాల మధ్య ఖాళీగా ఉన్న ఇళ్లను అద్దెకు తీసుకొని ఎవరికీ అనుమానం రాకుండా ఇంటిముందు తాళం వేసి లోపల టీవీలు పెట్టుకొని బెట్టింగులు కాస్తున్నారు. ఈ తరహా బెట్టింగ్లో అప్పటికప్పుడే డబ్బులు వెచ్చించి, అప్పటికప్పుడే వసూలు చేస్తున్నారు.
బెట్టింగులో పోలీసుల పాత్ర ?
క్రి కెట్ బెట్టింగ్లో కొంతమంది కిందిస్థాయి పోలీసు సిబ్బంది సహకారం ఉన్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. పోలీసుల నుంచి ఏ సమస్య తలెత్తకుండా ఉండేలా బుకీలు, ఏజెంట్లు మదనపల్లె, చిత్తూరు, పీలేరు తదితర ప్రాంతాల్లో కొంతమంది చోటాలీడర్లు, క్షేత్రస్థాయి పోలీసు సిబ్బందితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. భారీ మొత్తంలో బెట్టింగులు పెట్టినట్లయితే ఆ పరిసర ప్రాంతాల్లో గూఢచారులను నియమించి పోలీసుల కదలికలను గుర్తిస్తూ ఫోన్లో ఎప్పటికప్పుడు సమాచారం అందుకొని జాగ్రత్త పడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికైనా పోలీసులు దృష్టి సారించి బెట్టింగ్ను అరికట్టాల్సి ఉంది.
జిల్లాలో బెట్టింగ్ల జోరు!
Published Thu, Sep 26 2013 3:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
Viral Video: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్పై ప్రిన్సిపాల్ దాడి
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
తప్పక చదవండి
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
Advertisement