ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల భరోసా
హైదరాబాద్: ప్రజలపై భారం మోపకుండా ఖజానాకు ఆదాయం పెంచుకునే వేరే మార్గాలను తమ ప్రభుత్వం అన్వేషిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకోవటం, వాణిజ్య పన్నులపై కోర్టులు, అధికారుల వద్ద ఉన్న స్టేలను ఎత్తి వేయటం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటామని వెల్లడించారు. ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల అమలుపై అనుమానాలు, సందేహాలు అక్కర్లేదన్నారు. ఆదివారం సచివాలయంలోని సౌత్ హెచ్ బ్లాక్లో యనమల ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బడ్జెట్ తయారీకి సంబంధించి ప్రతిపాదనలు పంపాల్సిందిగా వివిధ శాఖలకు రాసిన లేఖపై తొలి సంతకం చేశారు. కొద్దిసేపు ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఎస్పీ సింగ్, అజయ్ కల్లాం, పీవీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం యనమల విలేకరులతో మాట్లాడుతూ...
రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచుకోవటంతో పాటు మరోవైపు ప్రజలపై భారం పడకుండా చూసుకోవటం తమ ప్రథమ కర్తవ్యమని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక వనరులు, ఆదాయం, వ్యయం క్లిష్టంగా ఉన్నాయని, వీటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ద్రవ్యలోటు ఎక్కువగా ఉందని, దాన్ని తగ్గించేందుకు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలు సవరించాల్సిందిగా కేంద్రాన్ని కోరతామని వెల్లడించారు. ఫలితంగా ద్రవ్యలోటు తగ్గిపోయి ప్రభుత్వం తీసుకునే చర్యలతో మిగులు ఏర్పడుతుందని, గ్రాంట్లు వస్తాయని వివరించారు. రాష్ర్టంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఉదారంగా సాయం అందించాలని ప్రణాళికా సంఘాన్ని కూడా కోరనున్నట్లు తెలిపారు. ప్రణాళికేతర వ్యయంపై గతంలో 20 శాతం కోత విధించామని, ఇక ముందు ఏం చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటుందో తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేంద్రం సాధారణ అమ్మకపు పన్ను (జనరల్ సేల్స్ టాక్స్) విధించే ఆలోచనలో ఉందని, దీన్ని కూడా తాము పరిశీలించాల్సి ఉందని చెప్పారు.
ప్రజలపై భారం మోపం
Published Mon, Jun 16 2014 12:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement