దేశం కోసం ఓటేయండి: కిషన్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

దేశం కోసం ఓటేయండి: కిషన్‌రెడ్డి

Published Tue, Mar 18 2014 5:03 AM

దేశం కోసం ఓటేయండి: కిషన్‌రెడ్డి - Sakshi

 పార్టీ సభ్యత్వం తీసుకున్న సుధీష్ రాంబొట్ల
 
రాజకీయ నాయకుల్ని చూసి కాకుండా దేశం కోసం ఓటేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి యువతకు పిలుపిచ్చారు. కాంగ్రెస్ పాలనలో దేశం భ్రష్టుపట్టిందని, దీన్ని మళ్లీ గాడిన పెట్టాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎవరు పాటు పడతారో గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నేత సుధీష్ రాంబొట్ల సోమవారమిక్కడ బీజేపీ సభ్యత్వాన్ని స్వీకరించారు.


bjp
బీజేపీ సీనియర్ నేత డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కిషన్‌రెడ్డితో పాటు బండారు దత్తాత్రేయ, ప్రేమ్‌సింగ్ రాథోడ్, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అవినీతి అంతమే తన పంతమన్న ఆమ్‌ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ పెద్ద సైకోగా తయారయ్యారని విమర్శించారు. నరేంద్రమోడీ ప్రభంజనం ముందు ఇలాంటి వారు నిలవలేరన్నారు.

Advertisement
Advertisement