గద్వాల, న్యూస్లైన్: దశాబ్దాలుగా కరువుప్రాంతంగా పేరొందిన గట్టు ప్రాంతం ఇక సస్యశ్యామలం కానుంది.. చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకోనుంది. ఈ ప్రాంతభూములకు కృష్ణానది జలాలను అందించే ఉద్దేశించిన గట్టు హైలెవల్ కెనాల్కు ప్రభుత్వం ఎట్టకేలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది.
ఇది పూర్తయితే నడిగడ్డలో ఎగువప్రాంత రైతులకు సాగునీరు అందడంతోపాటు, గ్రామాల్లో తాగునీటి సమస్య తీరనుంది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.10.50కోట్లు విడుదలచేసింది. దశాబ్దాలుగా ప్రతిపాదనలో ఉన్న నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి జలయజ్ఞంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం కుదించిన ఈ పథకాన్ని రెండులక్షల ఎకరాల ఆయకట్టుతో మంత్రి డీకే అరుణ అప్పట్లో వైఎస్కు వివరించి మంజూరు వచ్చేలా చేశారు. నెట్టెంపాడు నీళ్లందని గట్టు ఎగువప్రాంత కరువు నేలకు గట్టు హైలెవల్ కెనాల్ ద్వారా సాగు, తాగునీటిని అందించాలన్న ప్రతిపాదనను చేయగా.. తాజాగా మంజూరు ఇచ్చారు.
ఎత్తిపోతల రూపకల్పన ఇలా..
నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో రెండో పంప్హౌస్ వద్ద ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్కు పడమర వైపున ఆలూరు శివారులో రిజర్వాయర్ వద్ద ఇంటెక్ వెల్ను నిర్మిస్తారు. అక్కడ కేవలం 0.3 మెగావాట్ల విద్యుత్ వినియోగంతో నడిచే పంపింగ్ మోటారును ఏర్పాటు చేసి అక్కడి నుంచి గట్టు మండలలోని మల్లాపురం తండా పక్కన ఉన్న గజ్జెలమ్మగుట్టపైకి నీటిని పంపింగ్ చేస్తారు. అక్కడ భూతల భాండాగారం నిర్మిస్తారు. ఇందులోకి వచ్చిన నీటిని మూడు వైపులకు వెళ్లేవిధంగా చానల్స్ను ఏర్పాటు చేస్తారు. గుట్టపై నుంచి మండలంలోని చెరువులు, కుంటలకు నీళ్లు గ్రావిటిఫ్లో ద్వారా వెళ్లేలా కాల్వలను తవ్వుతారు. ఇలా దాదాపు 30 నుంచి 40 చెరువుల కుంటలను నీటితో నింపుతారు. వీటితో పాటు లిప్టు ద్వారా అదనంగా 3500 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తారు.
గట్టువాసులకు శుభవార్తే..!
వర్షాభావ పరిస్థితులతో కరువు ప్రాంతంగా మారిన గట్టు ఎగువ ప్రాంతానికి సాగు, తాగునీటిని అందించేందుకు గట్టు హైలెవల్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం మంజూరు ఇవ్వడం ఆ ప్రాంత ప్రజలకు శుభవార్తే. ప్రాజెక్టు సంబంధించిన సమగ్రసర్వేను నిర్వహించి పథకాన్ని చేపట్టేందుకు ఇక మార్గం సుగమమైంది.
- ప్రకాష్, ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్
ఫలించిన కల
Published Thu, Jan 23 2014 4:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement