వెంకటగిరిటౌన్/బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాను పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. డక్కిలి మండల పరిషత్ కార్యాలయ ఆవరణం, నెల్లూరు రూరల్ పరిధిలోని వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కళాశాల వద్ద శుక్రవారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో కేవలం మూడు అసెంబ్లీ స్థానాలే తమ పార్టీకి దక్కడంతో ఈ ప్రాంతంపై వివక్ష ఉందనే అపోహ ఉందన్నారు. ఇది నిజం కాదన్నారు.
వెంకటగిరి నియోజకవర్గంలోని సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. తెలుగుగంగ బ్రాంచి కాలువల నిర్మాణంపై దృష్టి సారిస్తానన్నారు. సోమశిల, కండలేరు రిజర్వాయర్లు నిండితే నీటి కొరత ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్యాయం చేసి రాజకీయ ప్రయోజనాల కోసం ముందుకు పోయిందన్నారు. అందుకే కాంగ్రెస్ను ఓడించి ప్రజలు భూస్థాపితం చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలన ఒడిదుడుకుల మధ్య సాగుతోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.200 పింఛన్ను రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చేశామన్నారు. జన్మభూమి పేరుతో ప్రజల్లో స్ఫూర్తి నింపేందుకు వస్తున్నామన్నారు.
అందుకు ఏడు గ్రిడ్లను ఏర్పాటు చేసినట్టు సీఎం చెప్పారు. వివిధ శాఖల సమన్వయంతో సాగే ఈ గ్రిడ్లతొ అభివృద్ధి పనులకు బంగారుబాటలు వేయనున్నామన్నారు. స్వగ్రామాలను స్వర్ణగ్రామాలుగా తీర్చిదిద్దుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఇసుకరీచ్లో మహిళా సంఘాలకు కేటాయించామన్నారు. ఇందులో వచ్చే ఆదాయంలో 25 శాతాన్ని మహిళల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. ఇది వారి అభివృద్ధికి ఉపయోగపడుతుందని చంద్రబాబు తెలిపారు. నీటి కొరతను అధిగమించేందుకు వాటర్గ్రిడ్ దోహదపడుతుందన్నారు. రూ.2 కే 20 లీటర్ల తాగునీటినిఅందించేందుకు సుజల స్రవంతి కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు.
గ్రామాలన్నింటికీ తారు రోడ్డు నిర్మించాలని ఉందన్నారు. అనంతరం ఆయన ఐదుగురికి పింఛన్ అందజేశారు. గ్రామ సమాఖ్యకు రూ.50 కోట్లు, పట్టణ సమాఖ్యకు రూ.25 కోట్లకు సంబంధించి చెక్ను అందజేశారు. స్టాల్స్ను పరిశీలించారు. మహిళలకు సీమంతం చేశారు. మంత్రి నారాయణ, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మంత్రులు ఆదాల ప్రభాకర్రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి , నాయకులు బీద రవిచంద్ర, కలెక్టర్ శ్రీకాంత్, జేసీ రేఖారాణిపాల్గొన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
Published Sat, Oct 11 2014 3:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement