పొన్నలూరు, న్యూస్లైన్: పార్లమెంటులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ సహకారంతోనేరాష్ట్ర విభజన చేపట్టిందని వైఎస్సార్ సీపీ కొండపి నియోజకవర్గ సమన్వయకర్త జూపూడి ప్రభాకరరావు అన్నారు.
రెండో విడత ఈనెల 11వ తేదీ జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మండలంలోని ముత్తరాసుపాలెం, ముప్పాళ్ల, వేంపాడు, ఉప్పలదిన్నె, రావులకొల్లు, పొన్నలూరు, వెంకుపాలెం, రాజోలుపాడు, అగ్రహారం, తిమ్మపాలెం, పెద వెంకన్నపాలెం వరకు బైక్ర్యాలీ నిర్వహించారు.
ర్యాలీలో జూపూడితో పాటు ఎమ్మెల్సీ పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పార్టీ నాయకుడు మద్దులూరి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. బైక్ ర్యాలీలో పలు చోట్ల జూపూడి మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాలను ఆశించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. ఇందులో టీడీపీ నాయకుడు చంద్రబాబు హస్తం కూడా ఉందని విమర్శించారు.
తెలంగాణ ఇచ్చినందుకు సోనియానే కాదు..సహకరించినందుకు ఈ చిన్నమ్మను కూడా గుర్తుంచుకోండని పార్లమెంటులో బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించారని, అలాంటి బీజేపీతో పొత్తుపెట్టుకోవడం టీడీపీకే చెల్లిందన్నారు. వలస నాయకులతో కిటకిటలాడుతున్న టీడీపీ ఏ క్షణంలోనైనా మునిగిపోతుందన్నారు. రాష్ట్రంలో స్థిరమైన పాలన అందించగల సత్తా జగన్కే ఉందన్నారు. ఎమ్మెల్సీ పోతుల రామారావు మాట్లాడుతూ పొన్నలూరు జెడ్పీటీసీ అభ్యర్థి అనుమోలు సాంబశివరావు, ఎంపీపీ అభ్యర్థి పల్నాటి వెంకటేశ్వరరెడ్డిని గెలిపించాలని కోరారు.
కార్యక్రమానికి ముందుగా ముత్తరాసుపాలెంలోని ఆంజనేయస్వామి గుడిలో నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. కొత్తశింగరబొట్లపాలెం గ్రామ నాయకుడు వేణుగోపాలరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో ఆయన్ను పరామర్శించారు. గ్రామానికి చెందిన ధనకోటిరెడ్డికి జూపూడి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అగ్రహారం సర్పంచ్ నాయబ్స్రూల్, రాజోలుపాడు డీలర్ రూబేను పార్టీలో చేరారు.
కొత్తపాలెం నాయకుడు మార్తాల వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 30 కుటుంబాలవారు, కల్లూరివారిపాలెంకు చెందిన కల్లూరి వెంకటేశ్వరరెడ్డి, బసిరెడ్డి సుబ్బారెడ్డి కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ సీపీలో చేరారు. చెరువుకొమ్ముపాలేనికి చెందిన పిల్లి గంగిరెడ్డి, పిల్లి వెంకటేశ్వర్లు కుటుంబాలు టీడీపీ నుంచి జూపూడి సమక్షంలో పార్టీలో చేరాయి. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఈశ్వరరెడ్డి, మండల కన్వీనర్ బెజవాడ వెంకటేశ్వర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు రాఘవరెడ్డి,పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పిల్లి లక్ష్మీనారాయణరెడ్డి, ఏఎమ్సీ వైస్ చైర్మన్ ఎస్ఏ లియాఖత్తో పాటు మండలంలోని అన్ని గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ సహకారంతోనే రాష్ట్ర విభజన
Published Tue, Apr 8 2014 2:09 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement