ముగిసిన పోస్ట్‌మెన్ ఉద్యోగాల రాత పరీక్ష | Sakshi
Sakshi News home page

ముగిసిన పోస్ట్‌మెన్ ఉద్యోగాల రాత పరీక్ష

Published Mon, Apr 13 2015 3:25 AM

The end of the written test for a job postmen

సాక్షి, విజయవాడ బ్యూరో:  తపాలాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా పోస్ట్‌మెన్ ఖాళీల భర్తీ కోసం ఆది వారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, నంద్యాల, హైదరాబాద్‌లలో 130 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1.50 లక్షల మందికి గాను 1.10 లక్షల మంది పరీక్ష రాశారని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయ ఉన్నతాధికారులు తెలిపారు. గుంటూరు డివిజన్‌లో ఖాళీగా ఉన్న 14 పోస్టులకు ఒక్కో పోస్టుకు వెయ్యి మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement