Sakshi News home page

రైతు ఆత్మహత్య

Published Sun, Jan 31 2016 4:41 PM

The farmer commits suicide

అప్పుల బాధ భరించలేక రైతు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురంతండాలో ఆదివారం చోటుచేసుకుంది. తండాకు చెందిన బానావత్ వెంకటేశ్వర నాయక్(58) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.


ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో.. వాటని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement