నిధులు విడుదల ఎ త్వరలో మిగతా మొత్తం..
రుణమాఫీ వివరాలు వెల్లడించిన కలెక్టర్ యువరాజ్
విశాఖపట్నం : ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీలో భాగంగా జిల్లాలో తొలివిడతగా రూ.157.17కోట్ల మేర రైతుల రుణాలు మాఫీ అయినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ వెల్లడించారు. జిల్లాలోని 43 మండలాల్లో పంట రుణాలు పొందిన రైతులను ఇప్పటికే గుర్తించి వారి వివరాలను సంబంధిత వెబ్సైట్లో పొందుపర్చినట్టు చెప్పారు. ఆయా వివరాల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా తొలివిడతలో రూ.349.34 కోట్ల మేరపంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
అయితే ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల మేరకు రూ.50వేల లోపు రుణాలను ఏకమొత్తంగా మాఫీ చేస్తున్నామన్నారు. ఆపైన రుణాలున్న రైతులకు ఐదు వాయిదాల్లో 20శాతం చొప్పున వడ్డీతోసహా లక్షన్నర రూపాయల మాఫీ మొత్తం జమ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి విడతకు సంబంధించి తక్షణమే రూ.157.17కోట్ల విడుదల చేసిందని, మిగిలిన మొత్తాన్ని త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుందన్నారు. ఈ మేరకు రుణవిముక్తి పత్రాలను ప్రస్తుతం నిర్వహిస్తున్న రైతు సాధికారత సదస్సుల్లో సంబంధిత రైతులకు అందజేస్తున్నామన్నారు. మండలాల వారీగా రుణమాఫీ వివరాలు ఇలా ఉన్నాయి.
సందేహాల నివృత్తికి కాల్ సెంటర్
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తింపులో రైతులకు ఎదురయ్యే సందేహాలు, ఇబ్బందులను నివృత్తి చేసుకునేందుకు పరిష్కార్ కాల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ యువరాజ్ తెలిపారు. రుణమాఫీ అమలుకు సంబంధించిన వినతులను ఈ కాల్ సెంటర్లో అధికారులు స్వీకరిస్తారన్నారు. ఈ సెంటర్కు టోల్ఫ్రీ నంబర్లు 1100, 180004-254440, 180010-32066కు ఫోన్చేసి రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చునని, ఫిర్యాదులు చేయవచ్చునని సూచించారు.
తొలి విడత రుణమాఫీకి రూ.157.17 కోట్లు
Published Sat, Dec 13 2014 1:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement