అధికారులకు కలెక్టర్ కేవీ రమణ ఆదేశం
కడప సెవెన్రోడ్స్ : ప్రజావాణికి వచ్చే వినతుల పరిష్కారానికి అధికారులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ కేవీ రమణ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కలెక్టరేట్కు వచ్చి అర్జీలు సమర్పిస్తుంటారని చెప్పారు. వాటిని అధికారులు పరిశీలించి సకాలంలో పరిష్కరించాలన్నారు.
కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో 268 ప్రభుత్వ చౌక దుకాణాలకు ఇన్ఛార్జి ఆర్డీఓగా ఉన్న లవన్న ఇచ్చిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దుచేయాలని టీడీపీ నాయకుడు ఇందిరెడ్డి శివారెడ్డి తదితరులు కోరారు. రోస్టర్ను సక్రమంగా రూపొందించలేదని చెప్పారు. అలాగే కోర్టు విచారణలో ఉన్న ఎఫ్పీ షాపులను కూడా నోటిఫికేషన్లో పొందుపరిచారన్నారు. భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈనెల 25న బదిలీపై వెళుతున్న ఇన్చార్జి ఆర్డీఓ హడావుడిగా నోటిఫికేషన్ విడుదల చేయడంపై పలు అనుమానాలు ఉన్నాయని వివరించారు.
జర్నలిస్టుల హెల్త్ కార్డుల దరఖాస్తులకు మరికొంత సమయాన్ని పొడిగించాలని జాప్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి.విజయకుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు జ్యోతి జార్జి కోరారు. వరుసగా పండుగలు రావడం వల్ల చాలామంది దరఖాస్తు చేసుకోలేక పోయారన్నారు. సమాచారం సైతం చాలామందికి తెలియదన్నారు.
జిల్లాలోని వికలాంగులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చిన్న సుబ్బయ్యయాదవ్, బీఎన్ బాబు తదితరులు కోరారు. పలుమార్లు తహశీల్దార్ల దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లినప్పటికీ వారు స్పందించడం లేదన్నారు.
కడప నగరంలోని పలు వీధులలో చెత్తాచెదారాలు పేరుకుపోతున్నప్పటికీ మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించడం లేదని అర్బన్ డెవలప్మెంట్ కమిటీ నాయకులు ఎం.చెండ్రాయులు, వై.తిరుమలయ్య, సుజాతరెడ్డి, ఎస్.గౌస్పీర్ తదితరులు ఫిర్యాదు చేశారు. ఈగలు, దోమలు ప్రబలి పలు వ్యాధులకు కారణమవుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రామారావు, ఇన్ఛార్జి ఏజేసీ సుబ్బారెడ్డి, డీఆర్వో సులోచన, ఇతర జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి వినతులకు తొలి ప్రాధాన్యత
Published Tue, Jan 20 2015 2:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
Advertisement