మార్కాపురం : పొలంలో సాగు చేసిన టేకు కర్ర నరికేందుకు అనుమతి కోరిన రైతు నుంచి అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి దప్పిలి రఘురామిరెడ్డి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం రాత్రి రెడ్హ్యాండెడ్గా చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి కథనం ప్రకారం.. మార్కాపురం పట్టణం పూలసుబ్బయ్య కాలనీలో నివాసం ఉంటున్న షేక్ మహబూబ్బాషా తర్లుపాడు మండలం మీర్జాపేటలో ఓ రైతు సాగు చేసిన టేకు చెట్లను కొనుగోలు చేశాడు. వాటిని నరికి అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ స్థానిక అటవీశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆ తర్వాత డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రఘురామిరెడ్డిని సంప్రదించి చెట్లను నరికేందుకు అనుమతి కావాలని కోరగా రూ.55 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
అంత ఇచ్చుకోలేనని చెప్పినా రఘురామిరెడ్డి వినిపించుకోకపోవటంతో మహబూబ్బాషా ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో రఘురామిరెడ్డి తన కార్యాలయం నుంచి బయటకు వచ్చి బైకుపై మహబూబ్ బాషాను ఎక్కించుకుని ఇంటికి వెళ్లాడు. అక్కడ మహబూబ్బాషా నుంచి రూ. 20 వేలు తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయాడు. ఆ వెంటనే రఘురామిరెడ్డి ఇంటికి ఏసీబీ డీఎస్పీ మూర్తి, ఇన్స్పెక్టర్లు కృపానందం, వెంకట సుబ్బారావు వచ్చారు.
వీరిని చూడి రఘురామిరెడ్డి కంగారు పడి నగదును దుస్తుల బుట్టలో పడేశాడు. ఏసీబీ అధికారులు ఆయన్ను చుట్టుముట్టి నగదు స్వాధీనం చేసుకున్నారు. తమ విచారణలో రఘురామిరెడ్డి లంచం తీసుకున్నట్లు రుజు వైందని, నగదుపై ఆయన వేలిముద్రలు గుర్తించామని డీఎస్పీ మూర్తి తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. అనంతరం రఘురామిరెడ్డి బావమరిది ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. రైతు ఇచ్చిన రూ.20 వేలతో తనకు సంబంధం లేదని అటవీ అధికారి రఘురామిరెడ్డి తెలిపారు.
ఉద్యోగుల్లో కలకలం
ప్రభుత్వ ఉద్యోగి రఘురామిరెడ్డి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడని తెలియడంతో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కలకలం రేగింది. తర్వాత టార్గెట్ ఎవరోనంటూ చర్చించుకున్నారు. గత నెల 24న యర్రగొండపాలెంలో విద్యుత్శాఖ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అంటే 15 రోజుల వ్యవధిలో ఒకే ప్రాంతంలో ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు.
ఏసీబీ వలలో అవినీతి చేప
Published Thu, Dec 11 2014 2:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
టీడీపీపై ఎన్నికల సంఘం సీరియస్
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
త్వరలో కాంగ్రెస్ చీలిపోతుంది: ఆచార్య ప్రమోద్ కృష్ణం
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
నా ఐపీఎల్ టీమ్కు మాటిచ్చా.. అందుకే సినిమాలకు బ్రేక్
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
ముంబై కథ ముగిసింది.. జట్టులో యూనిటీ లేదు: పఠాన్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement