భార్యను కడతేర్చిన భర్త
అనాథలుగా మిగిలిన పిల్లలు
పోలీసుల అదుపులో నిందితుడు!
పెందుర్తి: అనుమానంతో కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్ధుడు. కన్న పిల్లలకు తల్లి ఆప్యాయతను దూరం చేసి వారి జీవితాల్లో విషాదాన్ని నింపా డు. పెందుర్తి సమీపంలోని గాంధీనగర్లో మంగళవారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలివి.. కరాస ప్రాంతానికి చెందిన వాస గురునాథరెడ్డి, సుజాత(28) దంపతు లు ఆరేళ్ల కిందట గాంధీనగర్కు వచ్చి స్థిరపడ్డారు. అతను తాపీమేస్త్రిగా పనిచేస్తుండగా ఆమె కూలి పనులకు వెళుతోంది. కాగా గురునాథరెడ్డికి భార్యపై అనుమానం ఉంది. దీంతో చాలాకాలంగా ఇరువురికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. కొన్నాళ్ల కిందట భర్త వేధింపులకు తాళలేక ఆమె గృహహింస కేసు పెట్టింది. అప్పట్లో ఇరువురికి పోలీసులు రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో మరోసారి మంగళవారం రాత్రి ఇద్దరు తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. తాగిన మత్తులో గురునాథరెడ్డి సుజాతను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత తన భార్య ఉరేసుకుందని కేకలు వేశాడు.
అయితే స్థానికులు వచ్చేసరికి అతను పరారయ్యాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం డీసీపీ రామ్గోపాల్నాయక్, ఏసీపీ భీమారావు, సీఐ జె.మురళి ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఆమె మృతదేహాన్ని పరిశీలిం చి హత్య కేసుగా నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. నిందితుడు గురునాథరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. తల్లి హత్యకు గురై, తండ్రి దూరం కావడంతో పిల్లలు విఘ్నేష్, అంజలి అనాథగా మిగిలారు. తల్లి మృ తదేహం వద్ద వారు విలపించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. సీఐ జె.మురళి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానం పెనుభూతమై..
Published Thu, Jan 21 2016 12:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నగదు సీజ్
Lok Sabha Election 2024: మూడో దశలో... ముమ్మర పోరు
ఓటు వేసిన 5,964మంది
ఈవీఎంల కమిషనింగ్ పూర్తి
‘సాక్షి’ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెరగాలి
కోడ్ ముగియగానే ఇందిరమ్మ ఇళ్లు
ప్రజల గొంతుౖనై పోరాడా..
అంతకు మించి...
అటకెక్కిన కాంగ్రెస్ హామీలు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement