► ఎనిమిదేళ్లవుతున్నా కాపురానికి పిలవని భర్త
► అత్తింటి వద్ద ధర్నాకు దిగిన బాధిత మహిళ
► తనకు, కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్
గాజువాక : కూతురు పుట్టిందనే కారణంతో భార్యను వదిలించుకున్నాడొక ప్రబుద్ధుడు. వివాహ సమయంలో రూ.5 లక్షల కట్నం, 15 తులాల బంగారం తీసుకొని ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధింపులకు దిగాడు. దఫదఫాలుగా మరో రూ.1.40లక్షలను కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత కుమార్తె పుట్టిందని తన రక్త సంబంధీకులతో కలిసి కుమార్తెను, భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. ఎనిమిదేళ్లవుతున్నా కాపురానికి పిలవకుండా తాత్సారం చేస్తున్నాడు. తన కుమార్తె పెద్దదవుతుండడంతో భవిష్యత్పై ఆందోళన చెందిన బాధితురాలు అత్తింటి వద్ద ఆదివారం ధర్నాకు దిగింది. తనను కాపురానికి పిలవాలని, ఆస్తిలో వాటా ఇచ్చి కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. స్థానిక నాయకులు, స్థానిక మహిళా సంఘం ప్రతినిధులు ఆమెకు మద్దతుగా నిలిచారు.
ఈ సంఘటన వడ్లపూడి నిర్వాసిత కాలనీ కణితిలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట మండలం బొడ్డవరం గ్రామానికి చెందిన కృష్ణవేణికి కణితి కాలనీకి చెందిన రాడ్ బెండర్ సూరిశెట్టి సురేష్తో 2007 జూన్లో వివాహం చేశారు. పది రోజుల కాపురం తర్వాత అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్త అప్పలనర్సమ్మ, ఆడపడుచు కలిసి కృష్ణవేణిని వేధించడం మొదలుపెట్టారు. కుమార్తె కాపురం కోసం ఆమె తల్లిదండ్రులు దఫదఫాలుగా అదనపు కట్నం చెల్లించారు. ఏడాది తర్వాత ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన కృష్ణవేణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని అత్తింటి వారు ఆమెను చూడటానికి కూడా వెళ్లలేదు. పెద్దలు జోక్యంతో నెల రోజుల తర్వాత వెళ్లి పేరు (సాయి లిఖిత) పెట్టి వచ్చేశారు.
ఆ తర్వాత తల్లీ, బిడ్డలను ఇక్కడికి తీసుకురావడం కోసం కూడా పెద్దలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన నెల రోజుల తర్వాత పాపకు పుట్టిన రోజు వేడుకలు చేశారు. ఆ తర్వాత అదనపు కట్నం కోసం మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఒక రోజు భర్త సురేష్ బాగా తాగి వచ్చి కృష్ణవేణిని చావబాదడంతో స్థానికులు ఆమెను గాజువాకలోని ఒక ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకున్న ఆమె ఇంటికి రావడం కోసం బయల్దేరగా అప్పటికే ఆమెను పంపేయాలని కుట్రతో ఉన్న అత్త కొద్దిరోజులు పుట్టింటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. అత్త, గ్రామ పెద్దల సూచన మేరకు పుట్టింటికి వెళ్లిన కృష్ణవేణిని నేటికీ కాపురానికి పిలవ లేదు. ఆ తర్వాత రకరకాల గొడవలు చోటు చేసుకున్నాయి.
తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలంటూ వారిపై ఆమె గతంలో కేసు పెట్టింది. ప్రస్తుతం దానిపై కోర్టులో విచారణ సాగుతోంది. ఈ పరిస్థితిపై దిగులతో తన తల్లిదండ్రులు మంచం పట్టి మృతి చెందారని కృష్ణవేణి కన్నీరుమున్నీరైంది. తల్లిదండ్రుల మరణంతో సోదరులు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో కుమార్తెను తీసుకొని బతుకుదెరువు కోసం ఆరు నెలల క్రితం గాజువాక వచ్చేసింది. కూలి పనులు చేసుకుంటూ శ్రామికనగర్లో నివశిస్తోంది. అయినప్పటికీ అత్తింటి నుంచి పిలుపు రాకపోవడంతో ఆదివారం స్థానిక పెద్దలతో కలిసి అత్తింటి వద్ద ధర్నాకు దిగింది.
మెకు కణితి కాలనీలోని పెద్దలతోపాటు వైఎస్సార్సీపీ నాయకులు మారిశెట్టి గంగాభాయి, ఎం.పి.మల్లెపూలు మద్దతుగా నిలిచారు. ఆమె ధర్నాకు దిగడంతో భర్తతోపాటు అత్త, ఆడపడుచు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. దువ్వాడ జోన్ పోలీసులు సంఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. ధర్నా విరమించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. తనకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించబోనని బాధితురాలు స్పష్టం చేయడంతో వారు వెనుదిరిగారు.
కూతురు పుట్టిందని గెంటేశారు
Published Sun, Apr 3 2016 11:54 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
అరసవల్లిలో భక్తుల రద్దీ
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement