ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్యాయత్నం | Sakshi
Sakshi News home page

ఇద్దరు బిడ్డలతో తల్లి ఆత్మహత్యాయత్నం

Published Thu, Jul 23 2015 2:56 AM

ఇద్దరు బిడ్డలతో  తల్లి ఆత్మహత్యాయత్నం - Sakshi

♦ పాలల్లో పురుగుమందు కలిపి తాగిన వైనం
♦ తల్లి, కుమార్తె పరిస్థితి విషమం
 
 మౌంజీపాడు(పెంటపాడు) : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ బుధవారం ఉదయం  తన ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మౌంజీపాడుకు చెందిన గండికోట అమృతకు, భీమవరానికి చెందిన పెరుుంటర్ వెంకన్నబాబుతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి పదేళ్ల వయసు కుమారుడు పవన్‌కృష్ణ, ఏనిమిదేళ్ల కుమార్తె వైష్టవి ఉన్నారు. వెంకన్నబాబు వ్యసనాలకు బానిస కావటంతో ఆమె భర్త నుంచి విడిపోయింది. పిల్లను మొదట భర్త దగ్గరే విడిచిపెట్టింది. ఆమె కేశవరంలోని తన సోదరి వద్ద ఉండేది.

అనంతరం పిల్లలను ఆమె తెచ్చేసుకుంది. పుట్టిల్లరుున మౌంజీపాడులో నానమ్మ అచ్చెమ్మ వద్దకు వచ్చేసింది. అమృత చిన్నతనంలోనే ఆమె తల్లి లక్ష్మి మరణించటంతో తండ్రి మరో వివాహం చేసుకుని ఏలూరులో ఉంటున్నాడు. బుధవారం ఉదయం అమృత పాలు కాసింది. వాటిని మూడు గ్లాసుల్లో పోసింది. వాటిలో పురుగుమందు కలిపింది. వాటిని తల్లీ, ఇద్దరు బిడ్డలు తాగేశారు. ఈ విషయాన్ని అచ్చెమ్మ గమనించి  స్థానికులకు తెలిపింది.

స్థానికుల సాయంతో వారిని అంబులెన్స్‌లో గూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు.  మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడ నుంచి తణుకులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అమృత, వైష్టవి అపస్మారక స్థితిలో ఉన్నారు.  అమృత తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్ కళాశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. ఆమె బిడ్డలు ఇద్దరూ మౌంజీపాడులోని పాఠశాలలో చదువుకుంటున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement