కిరాణా స్టోర్స్లో రూ.1.25 లక్షల నగదు తీసుకుని మాయం
మోటార్సైకిల్పై వచ్చి దందా
ఉయ్యూరులో పట్టపగలు కలకలం
ఉయ్యూరు, న్యూస్లైన్ : సేల్స్టాక్స్ ఆఫీసర్ తరఫున వచ్చానంటూ ఓ మోసగాడు ఓ కిరా ణా దుకాణం నిర్వాహకులకు టోకరా వేశాడు. దుకాణంలో యజమాని భార్య ఉండటాన్ని అదనుగా చూసుకుని దబాయించి ఏకంగా రూ. 1.25 లక్షల నగదుతో పరారయ్యాడు. వచ్చిన వ్యక్తి వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగి కాదని తరువాత నిర్ధారణ కావటంతో ఆ వ్యాపారి కుటుంబంతో పాటు స్థానికులూ నివ్వెరపోయారు. ఉయ్యూరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పట్టణంలోని రావిచెట్టు ఎదురుగా శ్రీమణికంఠ జనరల్ స్టోర్స్ ఉంది. దుకాణం యజమాని రాచిపూడి శివనాగరాజు స్థానికంగా సుపరిచితుడే. మధ్యాహ్న సమయంలో భోజనానికి షాపుపైనే ఉన్న ఇంట్లోకి వెళ్లాడు. నాగరాజు భార్య శివలీల కౌంటర్లో కూర్చుని వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు.
సాయంత్రం మూడు, నాలుగు గంటల సమయంలో టిప్టాప్గా తయారైన ఓ వ్యక్తి మోటార్సైకిల్పై షాపు వద్దకు వచ్చాడు. లోనికి వెళ్లి.. ‘లెసైన్స్ ఏది ? వ్యాపార లావాదేవీలు ఎంత? గుమస్తాకి జీతం ఎంత? లెసైన్స్ రెన్యువల్ అయిందా?’ అంటూ హడావుడి చేశాడు. దీంతో వ్యాపారి భార్య శివలీల ‘ఎవరు సర్ మీరు?’ అని ప్రశ్నించగా, ‘సేల్స్ టాక్స్ ఆఫీస్ నుంచి వ చ్చా, మా సార్ దూరంగా ఉన్నారు. మీ వ్యాపార లావాదేవీలు ఏమీ బాగోలేదు, ఆయన వచ్చారంటే ఇబ్బందులు పడతారు’ అంటూ దబాయించాడు.
‘కౌంటర్ లో క్యాష్ ఎంత ఉంది?’ అంటూ అని ప్రశ్నించాడు. రూ. 1.25 లక్షలు నగదు ఉందని, ఈ నెల 12న తమ కుమారుడి వివాహ సందర్భంగా బంగారు నగలు కొనేందుకు తెచ్చి ఉంచామని శివలీల చెప్పింది. ‘ముందు ఆ నగదు నాకిచ్చేయండి’ అంటూ హుకుం జారీ చేయటంతో కంగారులో శివలీల మొత్తం డబ్బు అతడి చేతికి ఇచ్చివేశారు. నకిలీ ఉద్యోగి ఆ నగదు తో ద్విచక్రవాహనంపై ఎక్కి దుకాణంలోని గుమస్తా నాగరాజన్ను వెనుక ఎక్కించుకుని మసీదు వరకు వెళ్లాడు.
‘ఇక్కడే ఉండు, మా సార్ దగ్గరికి వెళ్లి వస్తా’ అని గుమస్తాను దించి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ అతడు తిరిగి రాకపోవటంతో గుమస్తా వెనుదిరిగి వెళ్లి విషయాన్ని యజమాని నాగరాజుకు చెప్పాడు. ఆయన చుట్టుపక్కల ఆరా తీయగా, అసలు సేల్స్టాక్స్ ఆఫీసర్లు ఎవరూ తనిఖీకి రాలేదని తేలింది. దీంతో వ్యాపారి ఉయ్యూరు సీఐ మురళీరామకృష్ణకు ఫిర్యాదు చేశాడు. సీఐ ఆదేశాల మేరకు టౌన్ ఎస్సై జానకిరామయ్య దుకాణం వద్దకు వచ్చి విచారణ జరిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
సేల్స్టాక్స్ ఉద్యోగి పేరుతో టోకరా !
Published Sat, May 10 2014 12:54 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement