అనంతపురం మెడికల్ : తొమ్మిది మంది వైద్యులు సమాచారం లేకుండా వెళ్లిపోయారు.. అలా చేస్తే ఎలా..? కనీసం సమయపాలన పాటించడం లేదు.. మీ అనుమతి లేకుండా ఎలా సెలవులో వెళ్తారు...ఆ వైద్యులకు మెమోలివ్వడంటూ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.నీరజను ఆదేశించారు. వైద్య కళాశాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు పట్టికను పరిశీలించారు.
వైద్యులు సరస్వతి, భాను, మాధవీలత, దుర్గా, వరలక్ష్మి, నాగజ్యోతి, అరుణకుమారి, శాంతబాయి, సుదర్శన్ వీరంతా ఎక్కడికి వె ళ్లారన్నారు. సెలవులో వెళితే వీరి లీవ్ లెటర్స్ను చూపించమన్నారు. వారంత ఇంటిమేషన్ లేదని చెప్పడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. వారికి మెమోలివ్వాలని ఆదేశించారు. విధులకు సక్రమంగా ఎందుకు హాజరుకావడం లేదని, సూపర్ విషన్ చేస్తున్నారా లేదానని ప్రశ్నించారు.
అందుకు ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సార్ నా పరిధిలో చేస్తున్నానని సమాధానం ఇచ్చారు. మంత్రి తక్షణం వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. మరోసారి తనిఖీ చేస్తానని, ఈ సారి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పని గంటల్లో జాప్యం చేయరాదన్నారు. ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనలకనుగుణంగా పనిచేయాలన్నారు.
స్వచ్ఛభారత్ చేశారా...చీపురు పట్టుకుని ఊడ్చారా అనిప్రశ్నించారు. ప్రతిభావంతులు మీరే స్వచ్ఛ భారత్ చేయకపోతే ఎలాగన్నారు. అందుకు ప్రిన్సిపాల్ స్పందిస్తూ సార్ గతంలో అందరూ చేశామన్నారు. వైద్య కళాశాలలో ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వీలైతే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఈవ్టీజింగ్పై ఉక్కుపాదం : అనంతరం మంత్రి మెడిసన్ విద్యార్థులతో మాట్లాడారు. ఎవరైనా ఈవ్టీజింగ్ చేస్తున్నార అని ఆరా తీశారు. అలా చేస్తే ఉక్కుపాదం మోపుతామన్నారు. అందరు స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలని తెలిపారు. ఈవ్టీజింగ్ నేరమని, అటువంటి వాటికి పాల్పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. బాగా చదువుకుని మంచి వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
వైద్యుల ఆవేదన : ప్రిన్సిపాల్ను ప్రశ్నించిన తీరు వైద్య కళాశాల వైద్యులను బాధించింది. తనిఖీలో ప్రిన్సిపాల్ను నిలబెట్టి మాట్లాడడం ఎంత వరకు సమంజమని ప్రశ్నిస్తున్నారు. వందల మంది వైద్యులకు అధిపతి అయిన ఆమెను నిలబెట్డడంపై వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
రెగ్యులరైజ్ చేయండి : ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న తమను రెగ్యులరైజ్ చేయూలని వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఈయూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. మంత్రి ఎదుట ప్లకార్డులు, బ్యానర్తో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మంత్రికి వినతి పత్రం అందించారు. ఈయూ నేతలు లోకేష్ యాదవ్, రాంప్రసాద్, రవి, రోషన్, మసూద్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతగా పని చేయండి
Published Wed, Jan 21 2015 2:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement